Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రజనీకాంత్ ‘కాలా’ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కాలా' సెన్సార్ విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ 14 కట్స్ పెట్టిందని, యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లలో ఒకరైన వినోద్ క్లారిటీ ఇచ్చారు.
'కాలా' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని... అయితే 14 కట్స్ అనేది నిజం కాదని తెలిపారు. ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందనే వార్తలు కూడా వినిపించాయి, ఇవి పూర్తిగా నిరాధారమైనవి అని నిర్మాత వినోద్ తెలిపారు.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే కోలీవుడ్లో సమ్మె జరుగుతున్నందున సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ఒక వేళ ఆ సమయానికి సమ్మె పూర్తయితే అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. 'కాలా' చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లైకా ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు. వారి నిర్ణయం మీదే సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది.
'కాలా' చిత్రాన్ని దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. రజనీకాంత్ సినిమా కావడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. దాదాపు రూ. 125 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. దీంతో పాటు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 75 కోట్లు అదనంగా వచ్చాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన రజనీకాంత్ అల్లుడు ధనుష్ రూ. 125 కోట్ల లాభాన్నీ సినిమా రిలీజ్ ముందే ఆర్జించారు.