Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
600 కోట్ల బడ్జెట్.. రూ 200 టికెట్ 3 వేలు.. ఇలా చేస్తే ఊరుకోను, ఫ్యాన్స్కు రజని హెచ్చరిక!
Recommended Video
సూపర్ స్టార్ రజినీకాంత, అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన విజువల్ వండర్ 2.0 చిత్రం నవంబర్ 29న విడుదలకు సిద్ధం అవుతోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. శంకర్ విజన్ ని వెండి తెరపై ఆస్వాదించేందుకు ప్రేక్షకులు రెడీ అయిపోతున్నారు. 2.0 చిత్రంపై ఉన్న క్రేజ్ తో అప్పుడే బ్లాక్ మార్కెట్ లో స్వైర విహారం మొదలైంది. కళ్ళు చెదిరే ధరకు ఈ చిత్ర టికెట్స్ విక్రయిస్తున్నారట.
600 కోట్ల బడ్జెట్
సమారు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎక్కువ సమయం ఈ చిత్ర గ్రాఫిక్స్ రూపొందించడానికే పట్టింది. ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు, స్టంట్ డైరెక్టర్స్ ఈ చిత్రానికి పనిచేశారు. రోబో చిత్రాన్ని తలదన్నేలా ఇందులో గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి. చిట్టి రోబో విన్యాసాలు, సూపర్ విలన్ గా అక్షయ్ కుమార్ భయంకర రూపాన్ని చూసేందుకు అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సిద్ధం అవుతున్నారు.
బ్లాక్ మార్కెట్ దందా మొదలు
2.0 లాంటి భారీ అంచనాలు ఉన్నా చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపుతారు. వారి ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ లో కొందరు దందా ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాము రజనీకాంత్ అభిమానులం అని తమ్ వద్ద 2.0 టికెట్స్ ఉన్నాయని ప్రేక్షకులని ఆకర్షిస్తున్నారట. రూ 200 టికెట్ ని 2 వేల నుంచి 3 వేల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇలా చేస్తే ఊరుకోను
ఈ నేపథ్యంలో రజని ఆదివారం రోజు అభిమానులకు, అభిమాన సంఘం నాయకులకు, థియేటర్ యాజమాన్యాలకు ప్రకటన జారీ చేశారు. తన అభిమానులు, అభిమాన సంఘాల నాయకులు ఎవరూ 2.0 టికెట్స్ విక్రయించరాదు. థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకుల నుంచి నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు టికెట్ అమ్మకూడదు. ఇలా చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని రజని ప్రకటన చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా
2.0 చిత్రం నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అమీజాక్సన్ ఈ చిత్రంలో రోబోగా, హీరోయిన్ గా నటించింది. చిత్ర విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో అద్భుతమైన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు.