Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కోల్కతాలో ల్యాండ్ అయిన రజినీకాంత్: ఈ దెబ్బతో మొత్తం పూర్తయ్యేలా ప్లాన్
ఏజ్తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తే హీరోల్లో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. రిజల్ట్తో పని లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రాజెక్టులను పట్టాలెక్కించే ఆయన.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో 'అన్నత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇటీవలే హైదరాబాద్లో సుదీర్ఘమైన షెడ్యూల్ను కొన్ని అవాంతరాల నడుమ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దీని కోసం రజినీకాంత్ మరోసారి ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది.
చాలా కాలంగా సరైన సూపర్ హిట్ కోసం వేచి చూస్తోన్న రజినీకాంత్ ప్రస్తుతం చేస్తున్న చిత్రమే 'అన్నత్తే'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్లో కొంత భాగం మిగిలి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ కోల్కతా ఫైనల్ షెడ్యూల్ను ప్లాన్ చేసింది. దీని కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా కోల్కతాలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన పార్ట్ షూటింగ్ ఇప్పటికే ముగిసిందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆయన ఫైనల్ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. దీంతో కొన్ని సీన్స్ రీషూట్ చేసేందుకే సూపర్ స్టార్ అక్కడకు వెళ్లినట్లు చెబుతున్నారు.
'అన్నత్తే' కోల్కతా షెడ్యూల్ దాదాపు ఇరవై రోజులు ప్లాన్ చేశారని అంటున్నారు. అక్కడ కాళికా దేవి టెంపుల్ ఆవరణలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.