Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అట్టహాసంగా రజనీకాంత్ ‘రోబో’ ఆడియో రిలీజ్...
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ ముద్దుగుమ్మ అందాల తార ఐశ్వర్య రాయ్ నటించిన ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం 'ఎంథిరన్" తెలుగులో 'రోబో" ఆడియో అత్యంత అట్టహాసంగా మలేషియాలోని పుత్రాజయలో విడుదల అయింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎ ఆర్ రెహ్మాన్ అంతే ప్రతిష్టాత్మకంగా సంగీతాన్ని అందించారని చిత్రం దర్శకుడు శంకర్ కొద్దిరోజుల క్రితం తెలిపిన విషయం తెలిసిందే.
కౌలాలంపూర్ లోని పుత్రాజయ స్టేడియంలో అత్యంత భారీగా జరిగిన ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, సినీ గేయ రచయిత వైరముత్తు, సన్ టీవీ అధినేత కళానిధి మారన్, తమిళ్ స్టార్ జయం రవి, రాధారవి, రమ్యకృష్ణలు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపు దిద్దుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని.. చిత్ర షూటింగ్ పూర్తయిందని..ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ..రజనీకాంత్ గారి చిత్రం ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు శంకర్ తెలుపుతున్నారు...ఈ చిత్రంలో మొత్తం 7 పాటలుంటాయని చాలా అంద్బుతంగా చిత్రీకరించామని ఈ చిత్రానికి తగ్గట్టుగా చక్కని సంగీతాన్ని అందించిన అస్కార్ అవార్డు గ్రహీత రెహ్మాన్ గారికి కతజ్ఝతలు తెలిపారు..