twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌ క్రికెట్ ఐకాన్స్ గా జూ ఎన్టీఆర్, రామ్‌ చరణ్

    By Srikanya
    |

    టాలీవుడ్ ‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఐకాన్ ‌లు వ్యవహరిస్తారని, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఒక్కో జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరిస్తూ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారని నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్ ‌కుమార్ మీడియాకు తెలియచేసారు. నటీనటుల సంఘం ఆధ్వర్యంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పేరుతో జనవరి 22, 23, 29, 30 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ విశేషాలను తెలియచేయటానికి చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

    ఈ సందర్భంగా శరత్‌కుమార్ మాట్లాడుతూ భారతీయ చలనచిత్ర సినీ స్టార్స్ అందరూ పాల్గొంటున్న తొలి స్టార్స్ క్రికెట్ ఇదే నన్నారు. ఈ తరహా స్టార్స్ క్రికెట్ టాలీవుడ్‌ లో మూడేళ్లుగా జరుగుతోందన్నారు. అక్కడ ప్రస్తుతం ఆ తరహాలోనే తమిళం, తెలుగు, కన్నడం, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్ సీసీఎల్ క్రికెట్ పోటీలో పాల్గొననున్నారని వెల్లడించారు. కోలీవుడ్ జట్టుకు ఐకాన్‌ గా విజయ్, సూర్య వ్యవహరిస్తారని తెలిపారు. శాండిల్‌ వుడ్ ‌లో పునిత్ రాజ్ కుమార్, సుదీప్, బాలీవుడ్ ‌కు సునీల్ ‌శెట్టి, సల్మాన్‌ ఖాన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక ప్రేక్షకుడిగా పాల్గొంటారని వివరించారు.

    అలాగే జనవరి 13న క్రికెట్ స్టార్స్ డ్రస్ ‌ను లాంచ్ చేయనున్నట్టు శరత్‌ కుమార్ చెప్పారు. గెలుపొందిన జట్టుకు రూ. 25 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. 'చెన్నై సూపర్‌ స్టార్స్‌'గా తమిళ హీరోలు, 'తెలుగు టైగర్స్‌'గా తెలుగు పరిశ్రమ, 'బెంగళూరు రాయల్స్‌'గా కన్నడ నటులు, 'ముంబయి హీరోస్‌'గా బాలీవుడ్‌ నటులు పోటీపడనున్నారు. 'చెన్నై సూపర్‌ స్టార్స్‌' జట్టుకు ఐకాన్‌ గా విజయ్‌, సూర్యలు వ్యవహరించనున్నారు. 'తెలుగు టైగర్స్‌' జట్టులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, జూ ఎన్టీయార్‌, రామ్‌ చరణ్‌ తదితరులున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X