Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జయలలిత బయోపిక్ క్వీన్కు ఝలక్.. లీగల్ నోటీసులు జారీ
అలనాటి హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత జీవితం ఆధారంగా పలు బయోపిక్ నిర్మాణాలు రూపొందుతున్నాయి. తాజాగా గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేషన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్న రమ్యకృష్ణ లుక్ను రిలీజ్ చేశారు. తమిళ, తెలుగు, హిందీ భాషలు, ఓటీటీ ప్లాట్ఫామ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే జయలలిత మేనల్లుడు దీపక్ మాత్రం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు సిద్దం అవుతున్నారు.
క్వీన్ సినిమా ఫస్ట్ లుక్ అనంతరం దీపక్ మాట్లాడుతూ.. నిర్మాత, దర్శకులకు లీగల్ నోటీసులు పంపిస్తాం. మా అనుమతి లేకుండా తెరకెక్కిస్తున్నందున మాకు కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత జీవితం చాలా సున్నితమైన అంశం, దానిని వక్రీకరించి తీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని దీపక్ తెలిపారు.
జయలలిత జీవితాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్గా రూపొందించే పనిలో ఉన్నారనే విషయం మాకు తెలిసింది. అమ్మ జీవితం ప్రజలందరికీ తెలుసు. నా సోదరి దీప, నా అనుమతి లేకుండా ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కించొద్దు అన్నారు.
ఇదిలా ఉండగా, జయలలిత జీవితంపై మరో సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రంలో జయలలితగా కంగన రనౌత్ నటిస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్తుంది. ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.