Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అత్తారింటికి దారేది రీమేక్.. అత్త పాత్రలో క్రేజీ హీరోయిన్!
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో అత్తారింటికి దారేది చిత్రం రూపొందింది. ఈ చిత్రం ప్రతికూల పరిస్థితుల్లో సైతం విడుదలై ఆ సమయంలో తెలుగు సినిమా రికార్డులన్నీ తిరగరాసింది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. శింబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అత్త పాత్రలో సీనియర్ హీరోయిన్
అత్తారింటికి దారేది చిత్రంలో అత్త పాత్ర చాలా కీలకం. కథ మొత్తం అత్త పాత్ర చుట్టూ తిరుగుతుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ కు అత్తగా నదియా నటించింది. నదియా పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ కోసం సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరో క్రేజీ ఆఫర్
రమ్య కృష్ణ ప్రస్తుతం అద్భుతమైన పాత్రలతో దూసుకుపోతోంది. బాహుబలిలో శివగామి పాత్ర తరువాత రమ్య కృష్ణ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఇటీవల రమ్య కృష్ణ తెలుగు చిత్రాలు శైలజారెడ్డి అల్లుడులో అత్తగా నటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పాత్రల్లో మెప్పించడం రమ్యకృష్ణకు అలవాటే.
మేఘా ఆకాష్, కేథరిన్
తెలుగు వర్షన్ లో సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా నటించారు. తమిళ రీమేక్ లో శింబు సరసన మేఘా ఆకాష్, కేథరిన్ హీరోయిన్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. చెన్నైలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్ నుంచి రమ్యకృష్ణ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారీ నిర్మాణ సంస్థ
భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఒరిజినల్ వర్షన్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో దర్శకుడు సుందర్ సి ఉన్నారు. తెలుగులో ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టించింది. శింబు మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో చూడాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.