Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
పవన్ దర్శకుడి చిత్రంలో దగ్గుబాటి రాణా
చెన్నై: పవన్ కళ్యాణ్ తో పంజా చిత్రం చేసిన విష్ణు వర్ధన్ గుర్తుండే ఉంటాడు. ప్రస్తుతం ఆయన తమిళంలో అజిత్ హీరోగా ఓ భారీ చిత్రం చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో దగ్గుపాటి రాణా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు. పాత్ర చిన్నదైనా కథకు కీలకమవుతుందని ఒప్పుకున్నానంటున్నారు. ఆర్య,తాప్సీ సెకండ్ లీడ్ పెయిర్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ప్రస్తుతం దగ్గుపాటి రాణా తమిళ, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి విడుదలకు ప్లాన్ చేస్తున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' లో చేస్తున్నారు. క్రిష్ దర్సకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఇటీవలే పొల్లాచ్చిలో విజయన్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాల్ని చిత్రించారు. ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ సాగుతోంది.
ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ ''సురభి కళాకారుడైన బీటెక్ బాబు జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. నాటకాలు వేసే బాబుకి ఉన్న సామాజిక స్పృహ ఎలాంటిది? దేవిక అనే డాక్యుమెంటరీ రూపకర్తతో పరిచయమయ్యాక ఏం చేశాడు? అనేది తెరపైనే చూడాలి. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తాము'' అన్నారు. బళ్లారి బేస్ గా కథనం నడుస్తుందని చెప్తున్నారు. గాలి జనార్ధన రెడ్డి పాత్రను బేస్ చేసుకుని ఆ పాత్రను రూపొందించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
హీరో రాణా మాట్లాడుతూ... "ఇది నాకు ఆరో సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నా కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పాత్రను చేస్తుండటం చాలా ఆనందంగా వుంద"ని అన్నారు. 'గమ్యం', 'వేదం'.. ఇవి రెండూ జీవితాల్లోంచి పుట్టిన కథలు. ఇది కూడా అలాంటిదే. అయినా వాణిజ్య అంశాలకు కొదవ ఉండదు''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో హీరోపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.