Don't Miss!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
విక్రమ్, ఇలియానాలకు విలన్ రవిరాజా పినిశెట్టి
విక్రమ్, ఇలియానా జంటగా రూపొందనున్న తమిళ చిత్రంలో ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తయారయ్యే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. భూపతి పాండ్యన్ దర్శకత్వం వహిస్తారు. మోహన్ నటరాజన్ నిర్మాత. ఇందులో హీరో, విలన్ పాత్రలు నువ్వానేనా అనేలా ఉంటాయని చెప్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఇక ఈ చిత్రానికి వేడి అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం.
ఈ చిత్రంలో విక్రమ్ ఓ పోలీస్ ఆఫీసర్ గా లీడ్ రోల్ చేయనున్నారు. ఆ పాత్రలో టిపికల్ గా క్రిమినల్స్ తో డీల్ చేయటం హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇలియానా పాత్ర ఓ వర్కింగ్ వుమెన్ చేసే పాత్ర అని చెప్తున్నారు. త్వరలో విడుదల కానున్న రావణ్ ఓ డిపెరెంట్ సినిమా అనీ, ఈ వేడి చిత్రం తన అభిమానులు రెగ్యులర్ గా ఆశించే యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమని విక్రమ్ చెప్తున్నాడు. ఇక తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు, రవిరాజ పినిశెట్టి ఈ చిత్రంలో విలన్స్ గా చేస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, వడివేలు ఇద్దరూ ఈ చిత్రం డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లలో ఒకే సారి రిలీజ్ కానుంది.
ఇక ఇంతకుముందు కూడా ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించిన 'ప్రతిఘటన' చిత్రంలో కాళీ పాత్రకు కోసం అడిగితే కాదన్నారు. ఆ తర్వాత కన్నడ నటుడు చరణ్ రాజ్ ని చేసి పేరు తెచ్చుకున్నారు. ఇక రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 'యముడికి మొగుడు', 'చంటి', 'బలరామకృష్ణులు', 'బంగారు బుల్లోడు', 'పెదరాయుడు' లాంటి విజయవంతమైన ఎన్నో చిత్రాలు వచ్చి సూపర్ హిట్టయ్యాయి.