Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడు శంకర్తో వివాదం: టాప్ కమెడియన్ మీద రెడ్ కార్డ్, ఇండస్ట్రీ నుండి బ్యాన్?
తమిళ సినీ పరిశ్రమలోని టాప్ కమెడియన్లలో ఒకరైన వడివేలు గురించి చెన్నైలో హాట్ టాపిక్ నడుస్తోంది. తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) అతడిపై రెడ్కార్డు జారీ చేసిందని, వడివేలును ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారనే ప్రచారం మొదలైంది.
ప్రముఖ దర్శకుడు శంకర్ గతంలో తన ప్రొడక్షన్ సంస్థలో నిర్మించిన 'హింసించే 23వ పులకేశి' సినిమాలో వడివేలు హీరోగా నటించాడు. ఇపుడు దీనికి సీక్వెల్గా 'హింసించే 24వ పులకేశి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను కూడా శంకర్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా నుండి వడివేలు అర్దాంతరంగా తప్పుకోవడం వివాదం నెలకొంది. దీంతో శంకర్ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. వడివేలు అర్దాంతరంగా తప్పుకోవడం వల్ల రూ. 9 కోట్ల నష్టం వాటిల్లిందని, దాన్ని వెంటనే చెల్లించాలని తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే అందుకు వడివేలు ఒప్పుకోక పోవడంతో అతడిపై రెడ్ కార్డ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అతడు 9 కోట్లు చెల్లించే వరకు అతడితో ఎవరూ సినిమాలు చేయవద్దని నిర్ణయించినట్లు సమాచారం.
'24వ రాజు పులికేసి' చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుండి వడివేలుతో వివాదం కొనసాగుతోంది. అతడు సరిగా షూటింగులకు రాక పోవడం వల్ల చాలా ఇబ్బంది పెట్టాడని, ఇపుడు సినిమా నుండి తప్పుకున్నాడని యూనిట్ ఆరోపిస్తోంది. అయితే వడివేలు కూడా శంకర్ మీద ఫిర్యాదు చేయడం గమనార్హం.