Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దర్శకుడు శంకర్తో వివాదం: టాప్ కమెడియన్ మీద రెడ్ కార్డ్, ఇండస్ట్రీ నుండి బ్యాన్?
తమిళ సినీ పరిశ్రమలోని టాప్ కమెడియన్లలో ఒకరైన వడివేలు గురించి చెన్నైలో హాట్ టాపిక్ నడుస్తోంది. తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) అతడిపై రెడ్కార్డు జారీ చేసిందని, వడివేలును ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారనే ప్రచారం మొదలైంది.
ప్రముఖ దర్శకుడు శంకర్ గతంలో తన ప్రొడక్షన్ సంస్థలో నిర్మించిన 'హింసించే 23వ పులకేశి' సినిమాలో వడివేలు హీరోగా నటించాడు. ఇపుడు దీనికి సీక్వెల్గా 'హింసించే 24వ పులకేశి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను కూడా శంకర్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా నుండి వడివేలు అర్దాంతరంగా తప్పుకోవడం వివాదం నెలకొంది. దీంతో శంకర్ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. వడివేలు అర్దాంతరంగా తప్పుకోవడం వల్ల రూ. 9 కోట్ల నష్టం వాటిల్లిందని, దాన్ని వెంటనే చెల్లించాలని తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే అందుకు వడివేలు ఒప్పుకోక పోవడంతో అతడిపై రెడ్ కార్డ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అతడు 9 కోట్లు చెల్లించే వరకు అతడితో ఎవరూ సినిమాలు చేయవద్దని నిర్ణయించినట్లు సమాచారం.
'24వ రాజు పులికేసి' చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుండి వడివేలుతో వివాదం కొనసాగుతోంది. అతడు సరిగా షూటింగులకు రాక పోవడం వల్ల చాలా ఇబ్బంది పెట్టాడని, ఇపుడు సినిమా నుండి తప్పుకున్నాడని యూనిట్ ఆరోపిస్తోంది. అయితే వడివేలు కూడా శంకర్ మీద ఫిర్యాదు చేయడం గమనార్హం.