Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఒక్క రోజు తేడాతో రెండు పరీక్షలు: రీచా గంగోపాద్యాయ
రవితేజతో నటించిన 'మిరపకాయ్" చిత్రం తర్వాత తెలుగు తెరకు దూరమై తమిళ తెరకు దగ్గరైన బెంగాళీ భామ రిచా గంగోపాధ్యాయ. ఈ సుందరాంగి ప్రస్తుతం తమిళంలో శింబుతో 'దబాంగ్" రీమేక్ 'ఓస్తీ" చిత్రంలో, అలాగే ధనుష్ కథానాయకుడిగా సెల్వరాఘవన్ తెరకెక్కిస్తున్న 'మయక్కమ్ ఎన్న" చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో 'ఓస్తీ" ఈ నెల 24న విడుదలవుతుండగా, 'మయక్కమ్ ఎన్న" ఒక్కరోజు తేడాతో ఈ నెల 25న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా రిచా మాట్లాడుతూ ' తమిళంలో నేను నటించిన 'ఓస్తీ", మయక్కమ్ ఎన్న" ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదలవుతుండటం ఓ పక్క ఆనందంగానూ, ఒకింత కంగారు గానూ వుంది. ఎందుకంటే ఈ రెండింటిలో ఏ చిత్రం విజయం సాధిస్తుందో , ఏది ప్రేక్షకులని నిరుత్సాహపరుస్తుందో అని కంగారుగా వుంది. నావరకైతే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులని అలరిస్తాయన్న నమ్మకముంది" అంటోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో మరోసారి టాలీవుడ్ లో రిచా గంగోపాధ్యాయ తన అదృష్టాన్ని పరీక్షంచుకోనున్న విషయం తెలిసిందే.