twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ ప్రేక్షకులు కుక్కలు.. సారీ చెప్పి చెంపలేసుకొన్న హీరోయిన్

    |

    బిగ్‌బాస్ తమిళ రియాలిటీ షో ప్రేక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ సాక్షి అగర్వాల్ క్షమాపణలు చెప్పింది. బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన సాక్షి మళ్లీ అతిథిగా ఇంట్లోకి ప్రవేశించింది. ఆమెతోపాటు అభిరామి, మోహన్ వైద్య కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి కుక్కలు అని వ్యాఖ్యానించడం పెద్ద దుమారం చెలరేగింది.

    ఇంటిలోకి అతిథిగా వచ్చిన సాక్షి అగర్వాల్ తన తోటి కంటెస్టెంట్ షరీన్‌తో మాట్లాడుతూ.. మనం నడిచే దారిలో కుక్కలు చాలా మొరుగుతుంటాయి. వాటిని పట్టించుకోవద్దు అని కామెంట్ చేశారు. దాంతో సాక్షి వ్యాఖ్యలపై ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. బుల్లితెర ప్రేక్షకులను అవమానించే విధంగా ఉన్నాయనే విమర్శలు తలెత్తాయి.

    Sakshi Agarwal tenders apologises on Dogs remark on Bigg Boss Tamil show

    సాక్షి వ్యాఖ్యలు దుమారం లేపుతున్న నేపథ్యంలో హోస్ట్ కమల్ హాసన్ రంగంలోకి దిగారు. అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావించగా సాక్షి సమర్థించుకొనే ప్రయత్నం చేసింది. తర్వాత అనూహ్యంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.

    కుక్కలు అంటూ చేసిన వ్యాఖ్యలపై తాను సారీ చెబుతున్నాను. ఇక ముందు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాను. బుల్లితెర ప్రేక్షకులను కించపరడం తన ఉద్దేశం కాదు అని సాక్షి ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు.

    English summary
    Actor Sakshi Agarwal tenders apologises on Dogs remark on Bigg Boss Tamil show. Sakshi said, she did not mean to insult the viewers of the show or did not try to insult the audience, he remark was a general statement that was been used, and she had no intentions of passing any disrespectful comments on the viewers of the show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X