Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తప్పు చేశానేమో అనిపిసున్నది.. నో డౌట్ అంటున్న సమంత
Recommended Video
అక్కినేని ఇంటి కోడలుగా మారిన తర్వాత సమంత షూటింగ్లతో బిజీగా మారింది. ప్రస్తుతం విశాల్ కలిసి ఇరుంబు థిరై అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో హీరో విశాల్పై సామ్ ప్రశంసల వర్షం కురిపించింది. ఇంతకీ సమంత ఏమన్నారంటే..
విశాల్ కెరీర్లో ఉత్తమ చిత్రంగా
విశాల్ కెరీర్లో ఇరుంబు థిరై చిత్రం ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. ఇది ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా మారుతుంది. ఈ చిత్రానికి మిత్రన్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కానీ అనుభవం ఉన్న దర్శకుడిగా సెట్లో ఆత్మవిశ్వాసంతో కనిపించారు.
కొత్త దర్శకులతో నటించలేదు..
మిత్రన్ చిత్రీకరించిన సన్నివేశాలు, రూపొందించిన ప్రోమోలు, పోస్టర్లు అద్భుతంగా ఉన్నాయి. చాలా సహజంగా కనిపిస్తున్నాయి. నేను ఇప్పటివరకు కొత్త దర్శకులతో నటించలేదు. కానీ మిత్రన్ చిత్రంలో నటించిన తర్వాత తప్పు చేశానా అనే ఫీలింగ్ కలుగుతున్నది.
అద్భుతమైన నమ్మకాన్ని
చిత్ర యూనిట్ అందరికీ మిత్రన్ అద్భుతమైన నమ్మకాన్ని కల్పించాడు. అందుకే సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. రిలీజ్కు ముందే మిత్రన్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
విలన్గా నటించినందుకు థ్యాంక్స్
ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ.. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో విలన్గా నటించేందుకు ఒప్పుకొన్నందుకు థ్యాంక్స్. అర్జున్ సినిమాకు అసిస్టెంట్గా పనిచేయడం ద్వారా సినిమా కెరీర్ను ప్రారంభించాను. ఆ సమయంలో అతను అందించిన సపోర్ట్ మరువలేను. నా తొలి చిత్రం చెల్లమే సమయంలో నాకు అండగా నిలిచి నైతికంగా మద్దతు ఇచ్చారు.
యాక్షన్ సీన్లు సూపర్
ఇరుంబు థిరై చిత్రంలో హైరేంజ్ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్లలో నటించేటప్పుడు మేము చాలా ఎంజాయ్ చేశాం. అర్జున్తో నటించడం గొప్ప అనుభూతి. నా చిత్రంలో ఆయన విలన్గా నటిస్తారని ఎన్నడూ ఊహించలేదు. ఈ చిత్రంలో చివరి 30 నిమిషాల కథ అద్భుతంగా ఉంటుంది అని విశాల్ తెలిపారు.
జనవరి 26న రిలీజ్
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఇరుంబు థిరై చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు విశాల్ తెలిపారు.