Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంపై సమంత ఫైర్
స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ఎటో వెళ్లిపోయింది మనస్సు షూటింగ్ నిమిత్తం లండన్ కి వెళ్లింది. అక్కడ కటార్ ఎవర్ వేస్ వారి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమె తన లగేజ్ ని పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ లో తెలియచేసింది. ఆ ఎయిర్ వేస్ వారు తన ట్రిప్ మొత్తం నాశనం చేసారని ట్వీట్ చేసింది. అయితే అందులో తన లగేజ్ తిరిగి సంపాదించుకున్నది లేనిది రాయలేదు.
ఇక అక్కడ షూటింగ్ ఫినిష్ చేసుకుని ఆమె త్వరలోనే హైదరాబాద్ రానుంది. ఈ నెల 30న జరిగే ఈగ ఆడియో పంక్షన్ కి ఆమె హాజరు కానుంది. గచ్చిబౌళి స్టేడియంలోని బ్రహ్మకుమారి అకాడిమి లో ఈ ఆడియో పంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈగ చిత్రంలోనూ,ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రంలోనూ నాని హీరోగా చేస్తున్నారు. రెండు చిత్రాలు ఒకటి రాజమౌళి,మరొకటి గౌతమ్ మీనన్ డైరక్ట్ చేస్తూండటంతో మంచి క్రేజ్ వస్తోంది. ట్రేడ్ లో కూడా ఈ చిత్రాలపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలపాటు మరో మూడు తెలుగు సినిమాలు చేస్తూ సమంత బిజిగా ఉంది.