Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'రతి దేవి'.. సైకాలజిలో పీహెచ్డి: విభిన్న పాత్రలో సమంత..
Recommended Video
సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. కావాల్సినంత టాలెంట్ ఉన్నా.. ఒక్కోసారి ఒక్క అవకాశం చేతిలో ఉండకపోవచ్చు. అదే సమయంలో 'పెళ్లి' కూడా హీరోయిన్ల కెరీర్ను మలుపు తిప్పుతుంది.
పెళ్లయిన హీరోయిన్లను హీరోల పక్కన చూపించడానికి ఇష్టపడని దర్శకులు, నిర్మాతలు ఉన్న ఇండస్ట్రీ మనది. ఇక కొంతమంది హీరోయిన్లయితే సహజంగానే పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రల కన్నా విభిన్న తరహా పాత్రలు చేయడానికే మొగ్గుచూపుతారు. ఇప్పుడదే దారిలో నడుస్తున్నారు అక్కినేని సమంత..
కాదనను.. కానీ!, సమంత ఎమోషనల్.. ఏడేళ్లయినా వెంటాడుతోంది..
డా.రతీదేవి పాత్రలో:
పెళ్లి అయిన కొద్ది రోజులకే షూటింగ్స్లో బిజీ బిజీగా గడుపుతున్నారు సమంత. అయితే పెళ్లి తర్వాత ఆమె ఎంచుకుంటున్న పాత్రలు విభిన్నంగా ఉన్నాయనే చెప్పాలి. విశాల్ 'ఇరంబు తిరై' చిత్రంలో సమంత పోషిస్తున్న పాత్రే ఇందుకు ఉదాహరణ. డాక్టర్ రతి దేవి అనే కీలక పాత్రలో సమంత ఇందులో నటిస్తున్నారు.
మలుపు తిప్పే పాత్ర:
సైకాలజిలో పీహెచ్డి చేసిన యువతి పాత్రలో సమంత 'ఇరంబు తిరై'లో కనిపించనున్నారు. కథను మలుపు తిప్పే ఆసక్తికర స్క్రీన్ ప్లే ఈ పాత్రతో ముడిపడి ఉంటుందట.
ట్రెడిషనల్ లుక్స్:
'ఇరంబు తిరై'లో సమంత పాత్రకు సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇందులో చీర కట్టులో సాంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు సమంత. అభిమానులను ఈ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంది.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి:
విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలోనే నిర్మాణంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసి 2018 జనవరిలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
తెలుగులో 'అభిమన్యుడు?':
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరి ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.ఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నటుడు అర్జున్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తెలుగులో ఈ సినిమాకి అభిమన్యుడు అనే పేరుని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.