Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
పైరసీ చేసి, సమస్యలో చిక్కుకున్న సమంత
చెన్నై : ఒక్కోసారి అత్యుత్సాహం కూడా కొంప ముంచుతుంది. అలాంటి సమస్యే ఇప్పుడు నటి సమంతకు వచ్చిపడింది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రం, సమంత జంటగా నటించిన చిత్రం 'పత్తు ఎండ్రదుకుల్ల'. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకు సంబంధించి నటి సమంత సమస్యల్లో చిక్కుకుంది. ఇందులో ధూమపానం చేస్తూ ఓ సన్నివేశంలో ఆమె నటించింది. ఆ ఫొటోను ఇటీవల ట్విట్టర్లో సమంతనే పోస్టు చేశారు. అందులోనూ అది పైరసీ సన్నివేశం కావడం గమనార్హం. దీనిపై పంపిణీదారులు మండిపడ్డారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పైరసీని అరికట్టాలంటూ తాము పోరాడుతుంటే.. ఇలా పైరసీ చేసిన దృశ్యాన్ని పోస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. పంపిణీదారుల సంఘం మాజీ అధ్యక్షులు కలైపులి శేఖరన్ మాట్లాడుతూ.. ధూమపానంపై పలు స్వచ్ఛంద సంస్థలు పోరాడుతున్నాయని తెలిపారు. దీనివల్ల అనర్థాలపై కూడా కొందరు అవగాహన కల్పిస్తున్నారని గుర్తుచేశారు. ఈ పరిస్థితిలో సమంత ఇలాంటి సన్నివేశంలో నటించడం శోచనీయమని పేర్కొన్నారు.
అది సినిమా కోసమే అని సర్దుకున్నా.. అలాంటి ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేయడం సముచితం కాదని హితవుపలికారు. దీనిపై సమంత వివరణ ఇవ్వాలని సూచించారు. పలు హిందూ సంఘాలు కూడా సమంత వైఖరిపై ఆగ్రహంతో ఉన్నాయి. ఇలాంటి సన్నివేశంలో ఇకపై నటించకూడదని డిమాండ్ చేస్తున్నాయి.