Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
రామ్ చరణ్ తో పాటు సమీరా రెడ్డి కూడా ఎడిక్ట్
రామ్ చరణ్ ఆ మధ్యన ట్వీట్ చేస్తూ..తాను తన ఫోన్ లో ఉన్న యాంగ్రీ బర్డ్స్ గేమ్ కు ఎడిక్ట్ అయ్యాయని,తనకు ఎప్పుడు టైమ్ దొరికితే అప్పుడు అ ఆట ఆడుతున్నాను అన్నాడు. ఇప్పుడు సమీరా రెడ్డి కూడా అవే మాటలు వల్లిస్తోంది. ఆమె మాట్లాడుతూ..తాను ఫోన్ లో ఏంగ్రీ బర్డ్స్ గేమ్ కు ఎడిక్ట్ అయ్యానని,అస్సలు దాన్ని ఆడకుండా ఉండలేనని అంది. ప్రస్తుతం సమీరా రెడ్డి..ఇప్పటి వరకు స్కిన్ షో చేసిన సినిమాలేవీ నాకు పేరు తీసుకు రాలేదు.
ఇక పై నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాని అని కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇక గతంలో నేను తమిళంలో చేసిన 'వారనమ్ అయిరమ్'(సూర్య సన్నాఫ్ కృష్ణన్) నాకు మంచి పేరు తీసుకువచ్చింది. అలాంటి పాత్రలు చేయటం కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇకపై అలాంటి పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. అలాగని ఒకే టైపు పాత్రలు చేయాలన్న బోర్ కొడుతుంది. సినిమా సినిమాకి కొత్తదనం ఉండాలి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇటీవలే తమిళ్లో నటించిన 'వెట్టై' చిత్రం పెద్ద హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులోనూ రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.