Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పోలీసుల చేతిలో పడి గోలెత్తిన సమీరా రెడ్డి
ఎన్టీఆర్ తో అశోక్ చిత్రంలో చేసిన సమీరా రెడ్డి తాజాగా పోలీసుల చేతికి చిక్కి తన్నులు తిని గెంటివేయబడి అవమానం పాలయింది. అయితే ఈ సంఘటన మలేషియాలోని కౌలాంలపూర్ లో జరిగింది. ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం అక్కడకి వెల్ళిన ఆమె ఓ స్టార్ హోటల్ లో దిగింది. అక్కడ చాలా మంది మలేషియన్స్ ఆ హోటల్ లో దిగారు. ఓ రోజు ఉదయం లిప్ట్ దిగుతూండగా కొందరు మనుషులు వచ్చి ఆమెను అనుమానించి వారి భాషలో కొన్ని ప్రశ్నలు అడిగారు. సమీరా దానికి బదులు చెప్పలేదు. దాంతో కాలిన వారు లిఫ్ట్ నుంచి బయిటకు లాక్కొచ్చారు. బలవంతంగా లాగటానికి మీరెవరు అని ఆమె అరవటంతో రెండు వేసారు. అయితే ఈలోగా యూనిట్ కారు డ్రైవర్ అక్కడకు చేరుకుని అసలు విషయం తెలుసుకున్నాడు. అక్కడికి ఓ మలేషియన్ విఐపి మినిస్టర్ వస్తున్నారని..ప్రత్యేకంగా సెక్యూరిటీ చూస్తున్నారని,ఆ మనుషులు స్పెషల్ పోలీసులని చెప్పాడు. అంతేగాక ఆమె ఇండియన్ ఆర్టిస్టు అని వారికి తెలియపరిచి వాతావరణాన్ని తేలిక పరిచారు. ఈ విషయాన్ని ఆమె అక్కడ మీడియాతో మాట్లాడింది. తానూ వారు...పొరపడటంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇలా జరిగిందని చెప్పింది. ఈ విషయంలో సారీలు తప్ప చేయగలిగిందేమీ లేదని చెప్పుకొచ్చింది. అదీ సంగతి.