దేవిశ్రీ ప్రసాద్ తో బాలీవుడ్ భామ సమీరా రెడ్డి...!
బాలీవుడ్ భామ సమీరాడ్డితో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ త్వరలో చిందులేయబోతున్నాడు. అది స్టేజ్పై కాదు ఓ సినిమాలో...తెలుగులో గోపీచంద్,అనుష్క జంటగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శౌర్యం". ఈ చిత్రాన్ని విశాల్ కథానాయకుడిగా తమిళ్లో ప్రభుదేవా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 'వేడి" అనేపేరుతో రీమేక్ చేస్తున్న ఈ చిత్రం కోసం ప్రభుదేవా ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించబోతున్నాడు. ఈ ప్రత్యేక గీతంలోనే దేవీశ్రీ ప్రసాద్ తో కలిసి కథానాయిక సమీరాడ్డి చిందులేయడానికి రెడీ అయిపోతోంది. ఈ ప్రత్యేక గీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని కోలీవుడ్ సమాచారం.
అలాగే ఇటీవల బాల రూపొందించిన 'వాడు-వీడు" చిత్రంతో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన విశాల్ నటిస్తున్న పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంతో మళ్ళీ యాక్షన్ హీరోగా విజయాన్ని దక్కించుకోవాలని ఈ యువ హీరో తాపవూతయపడుతుండటం గమనార్హం. ప్రస్తుతం తెలుగు,తమిళ, హిందీ భాషల్లో చెప్పుకోదగ్గ అవకాశాలు లేని సమీరాడ్డికి ఈ ప్రత్యేక గీతమైనా అవకాశాలు తెచ్చి పెట్టేనా..


Click it and Unblock the Notifications











