Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హ్యాపీ యానివర్సరీ మై జాన్.. సాయేషా పోస్ట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు కామన్. హీరో హీరోయిన్లు, దర్శకులు హీరోయిన్లు ఇలా ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలున్నాయి. అలా తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషాలు సైతం ప్రేమలో ముగిని వివాహా బంధంతో ఒక్కటయ్యారు. 2019లో వివాహా బంధంతో ఒక్కటైన ఈ జంటను చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న వయోబేధం చూసి ముక్కుమీద వేలుసుకున్నారు నెటిజన్లు.
అయితే ఈ ఇద్దరూ మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. లాక్డౌన్లో సాయేషా చేసిన డ్యాన్స్ వీడియోలన్నీ కూడా ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇక గర్భవతి అంటూ వచ్చిన రూమర్లపై సాయేషా ఓ రేంజ్లో ఫైర్ అయింది. ఎప్పుడూ మీకు అలాంటి వాటిపైన దృష్టి ఉంటుందా? అది మా వ్యక్తిగత జీవితం అంటూ ఫేక్ న్యూస్పై సాయేషా ఓ రేంజ్లో మండి పడింది.
సాయేషా ఆర్యల వివాహాం జరిగి నేటికి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సాయేషా ఓ ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ యానివర్సరీ మై జాన్.. ఇప్పుడు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయేషా కన్నడ చిత్రంతో బిజీగా ఉంది. ఆర్య తమిళ తెలుగు చిత్రంతో బిజీగా ఉన్నాడు. విశాల్ , ఆర్య కలిసి ఎనిమీ అనే సినిమాతో రాబోతోన్నారు. మొత్తానికి సాయేషా షేర్ చేసిన ఫోటో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.