Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కమల్ హాసన్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు ఎవరంటే...
మన్మధబాణంతో చతికిల పడ్డ కమలహాసన్ తన తదుపరి చిత్రానికి దర్శకుడు గా సెల్వరాఘవన్ ని ఎన్నుకున్నట్లు సమాచారం. క్రిందటి వారం ఆయన్ని కలిసి సెల్వరాఘవన్ ఓ సింగిల్ లైన్ స్టోరీ వినిపించినట్లు, అది ఆయనకు బాగా నచ్చినట్లు తమిళ చిత్ర పరిశ్రమలో వినపడుతోంది. వాస్తవానికి కమల్ తన మన్నధబాణం తర్వాత తలైవన్ ఇరుక్కిండ్రాన్ అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో సన్నాహాలు చేస్తున్నారు. అయితే సెల్వరాఘవన్ చెప్పిన కథ ఆయన్ను బాగా ఇంప్రెస్ చేయడంతో ఆ చిత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. దాంతో రీసెంట్ గా సెల్వరాఘవన్ బెంగళూరులోని ఒక రీసార్ట్లో కూర్చుని ఈ చిత్ర స్క్రిప్టును పూర్తి చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన తన సోదరుడు ధనుష్, ఆండ్రియా కాంబినేషన్ లో ఇరండు ఉలగం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాని షూటింగ్ మార్చిలో పూర్తికానుంది. తదనంతరం మేలో కమల్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇక సెల్వరాఘవన్ తెలుగులో ఆడువారి మాటలకు అర్దాలే వేరులే చిత్రం రూపొందించి విజయం సాధించారు. అలాగే రానాతో ఓ చిత్రం అనుకున్నారు కానీ అది మెటీరియలైజ్ కాలేదు.