Don't Miss!
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ బడ్జెట్ సినిమాలో స్టార్ హీరో భార్య స్పెషల్ రోల్.. 20 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ
చాలా వరకు స్టార్ హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో పెళ్లి అయిన తరువాత కూడా అదే రేంజ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గ్లామర్ విషయంలో కూడా కొందరు ఏ మాత్రం హద్దుల్లో ఉండడం లేదు. అయితే అప్పట్లో మాత్రం హీరోయిన్స్ చాలా వరకు పెళ్లయిన మరుక్షణమే సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేసేవారు. అలాంటి వారిలో షాలిని ఒకరు. అయితే 20 ఏళ్ల అనంతరం ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో మెగాస్టార్ సినిమాలో..
షాలిని అనగానే అందరికి మెగాస్టార్ సినిమా గుర్తొస్తుంది. కె.రాఘవేంద్రరావు రావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పండు అనే చిన్నారి పాత్రలో కనిపించిన షాలిని ఆ తరువాత మళ్ళీ తెలుగు సినిమాలో నటించలేదు. ఎక్కువగా తమిళ్ మళయాళం కన్నడ సినిమాలతో బిజీబిజీగా కనిపించింది.
హీరోయిన్ గా భారీ క్రేజ్
కొన్నాళ్లకు హీరోయిన్ గా పలు లవ్ స్టోరీలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. తెలుగులో హీరోయిన్ గా చేయలేదు గాని ఆమె నటించిన తమిళ సినిమాలు కొన్ని టాలీవుడ్ లో రీమేక్ అయ్యి బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. అందులో మాధవన్ సఖి సినిమా ఒకటి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అజిత్ తో ప్రేమ, పెళ్లి
ఇక స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఎక్కువగా అందుకుంటున్న సమయంలోనే ఆమెకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో వివాహం అయ్యింది. 1999 లో సరన్ సినినా షూటింగ్ సమయంలో, షాలిని అజిత్ కుమార్ తో డేటింగ్ ప్రారంభించింది. ఆ షూటింగ్ అనంతరం అజిత్ ప్రపోజ్ చేయడంతో 2000వ సంవత్సరంలో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
Recommended Video
మళ్ళీ 20 ఏళ్ళ తరువాత
ఇక పెళ్లి తరువాత వెండితెరపై కనిపించని షాలిని మళ్ళీ 20 ఏళ్ళ తరువాత బిగ్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ హిస్టారికల్ ల్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో షాలిని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఆ పాన్ ఇండియా వినిమాలో జయం రవి, కార్తీ, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే.