twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ దేశంలో పని పూర్తిచేసిన త్రిష.. ఇక మెగాస్టార్స్‌తోనే తరువాయి

    |

    ఒకానొక సమయంలో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ త్రిష. తెలుగు చిత్రసీమలోని అందరు అగ్రహీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో వరుస ఆఫర్స్ పెట్టేస్తూ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తన తాజా సినిమా 'రాంగీ' షూటింగ్ ఫినిష్ చేసుకొని తన పని పూర్తిచేసుకున్నా అని చెబుతోంది.

    ఎం. శరవణన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాంగీ' మూవీ షూటింగ్ కోసం రెండు సార్లు ఉబ్జెకిస్తాన్‌కు వెళ్ళింది త్రిష. మొదటిసారి వెళ్లినప్పుడు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు, పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను పూర్తిచేసిన చిత్రయూనిట్.. రెండోసారి వెళ్ళినపుడు ఇంకొంత భాగం పూర్తిచేసుకుంది. ఈ మేరకు ఇక తన పని పూర్తయిందని త్రిష పేర్కొంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కథ, మాటలు అందించడం విశేషం. సి. సత్య ఈ సినిమాకు సంగీతం అందించారు.

    Senior heroine Trisha Latest movie shooting update

    మరోవైపు మలయాళంలో మోహన్‌లాల్‌ తో కలిసి 'రామ్‌' చిత్రంతో పాటు, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలోనూ నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ పైకి ఇటీవలే చేరిన త్రిష.. మెగాస్టార్‌తో కలిసి ఓ సాంగ్ షూట్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

    English summary
    Senior heroine Trisha raangi shooting finished recently. Now she is busy with megastar chiranjeevi movie which is directed by Koratala shiva
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X