Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ దేశంలో పని పూర్తిచేసిన త్రిష.. ఇక మెగాస్టార్స్తోనే తరువాయి
ఒకానొక సమయంలో టాలీవుడ్ని ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ త్రిష. తెలుగు చిత్రసీమలోని అందరు అగ్రహీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో వరుస ఆఫర్స్ పెట్టేస్తూ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తన తాజా సినిమా 'రాంగీ' షూటింగ్ ఫినిష్ చేసుకొని తన పని పూర్తిచేసుకున్నా అని చెబుతోంది.
ఎం. శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాంగీ' మూవీ షూటింగ్ కోసం రెండు సార్లు ఉబ్జెకిస్తాన్కు వెళ్ళింది త్రిష. మొదటిసారి వెళ్లినప్పుడు కొన్ని యాక్షన్ సీక్వెన్స్తో పాటు, పోలీస్ బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలను పూర్తిచేసిన చిత్రయూనిట్.. రెండోసారి వెళ్ళినపుడు ఇంకొంత భాగం పూర్తిచేసుకుంది. ఈ మేరకు ఇక తన పని పూర్తయిందని త్రిష పేర్కొంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ, మాటలు అందించడం విశేషం. సి. సత్య ఈ సినిమాకు సంగీతం అందించారు.
మరోవైపు మలయాళంలో మోహన్లాల్ తో కలిసి 'రామ్' చిత్రంతో పాటు, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ పైకి ఇటీవలే చేరిన త్రిష.. మెగాస్టార్తో కలిసి ఓ సాంగ్ షూట్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.