Don't Miss!
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వివాదాల్లో 'సెవెంత్ సెన్స్' చిత్రం
మురగదాస్, సూర్య కాంబినేషన్ లో వచ్చిన సెవెంత్ సెన్స్ చిత్రం హిట్టు మాటలా ఉన్నా రోజుకో వివాదంలో కూరుకుపోతోంది. ఈ చిత్రం తమిళ చరిత్రను బేస్ చేసుకుని తయారు చేసానని, తమిళలు అంతా గర్వపడతారని రిలీజుకు ముందు మురగదాస్ చెప్పటం జరిగింది. గర్వపడటం ఎలా ఉన్నా ఇప్పుడు అస్సలు సినిమాలో చూపిన భోదిదమ్మ అనే వ్యక్తి తమిళనాడు నుంచి వెళ్లలేదని, చరిత్రను సరిగ్గా తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు తీసారంటూ భోధిదమ్మకు ట్రస్టుకు చెందిన కొందరు ప్రముఖలు వ్యాఖ్యలు చేసారు. అది ప్రక్కన పెడితే ఇక్కడ తమిళనాడులో పల్లవ రాజే భోధిదమ్మగా మారాడంటూ చూపారు. కానీ సినిమాలో చూపినట్లు అస్సలు పల్లవరాజు డ్రస్ లు, కట్టు బొట్టు తమిళ సంప్రదాయం కాదని అని లోకల్ గా ఉండే చరిత్రకారులు మండిపడుతున్నారు. అంతేకాక బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా చరిత్రపై సినిమాలు తీస్తున్నాయని అక్కడి భాస్కరన్ అనే చరిత్రకారుడు అన్నారు.
దాంతో తమిళ చరిత్రను ఓ ఊహాత్మక కథగా, కల్పిత గాధగా మార్చేసారని అన్నారు. మరికొందరు సైంటిఫిక్ గా ప్రపచం డవలప్ అవుతున్న దశలో ఆవు పేడ గొప్పతనం చెప్పాలని మురగదాస్ ప్రయత్నించాడని వ్యాఖ్యానించారు. ఇక దీపావళి కానుకగా తెలుగునాట విడుదలైన ఈ చిత్రం ఇక్కడ వర్కవుట్ కాలేదు. తమిళంలో యావరేజ్ ఫిల్మ్ గా టాక్ తెచ్చుకుంది. చరిత్రను సినిమాలో హైలెట్ చేసే ప్రయత్నం చేసినా అందుకోసం సినిమాలో మిగతా పాత్రలతో కలిపిన అవాస్తవిక అంశాలు సినిమాను దిగజారేలా చేసాయని అక్కడ మీడియా దుమ్మత్తిపోసింది.