శంకర్ ‘త్రీ ఇడియట్స్’ రీమేక్ ఆగలేదు...మొదలైంది
హిందీలో ఘనవిజయం సాధించిన 'త్రీ ఇడియట్స్" చిత్రం ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రీమేక్ అవుతోందని, ఆగిపోయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ప్రస్తుతం 'వేలాయుధం" (నాగార్జున అజాద్ రీమేక్) చిత్రంలో నటిస్తున్న విజయ్ ఫిబ్రవరి 7నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గోనున్నారని తెలిసింది. అమీర్ఖాన్, మాధవన్, శర్మన్జోషి నటించిన ఈ చిత్రం రైట్స్ ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో అమీర్ఖాన్ పాత్రకు విజయ్ను,ఇతర రెండు పాత్రలకు జీవా, శ్రీరామ్లను ఎంపిక చేసారు. మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. హీరోయిన్గా ఇలియానా ఎంపికైంది. అలాగే ఈ చిత్రానికి తమిళంలో 'మువ్వర్", తెలుగులో 'త్రీ రాస్కెల్స్" పేర్లను పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











