Don't Miss!
- Finance Patanjali Share: బాబా రామ్దేవ్ కంపెనీకి విదేశీ ఇన్వెస్టర్లు.. కోర్టు మెుట్టికాయల తర్వాత..
- News బెంగళూరు ఎయిర్ పోర్టులో యూట్యూబర్ ఏం చేశాడంటే ?, వైరల్ వీడియోతో చిక్కిపోయాడు !
- Technology Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- Sports IPL 2024: రియాన్ పరాగ్కు బీసీసీఐ ప్రమోషన్..!
- Lifestyle అందుకే కవలలు పుడతారు.. ఈ రహస్యం తెలియని వారు చాలా తక్కువ..
- Automobiles సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
- Travel ఇండియాలోని సమ్మర్లో వెళ్లకూడని సందర్శనీయ ప్రదేశాలివే!
అన్ని సినిమాలను పక్కన పెట్టేసిన శంకర్.. అప్పటి దాకా ఇక ఆ పనిలోనే బిజీ!
స్టార్ డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ తో చేయాల్సిన ఇండియన్ 2 సినిమా విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. ఎన్నోసార్లు మొదలుపెట్టాలి అని అనుకున్నా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన మరో రెండు సినిమాలు ప్రకటించడం, ఆ తర్వాత ఆ రెండు సినిమాలకు లైకా ప్రొడక్షన్ సంస్థ బ్రేకులు వేయడానికి చూడడం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి శంకర్ సినిమాలకు సంబంధించిన అన్ని పనులు పక్కన పెట్టేసాడు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే
చివరిగా రోబో2తో
ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ చివరిగా రోబో 2 అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య ఆయన మొదలు పెట్టిన ఇండియన్ 2 సినిమా అనేక కారణాలతో షూటింగ్ ఆగి పోయింది. ఆ తర్వాత శంకర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావించినా హీరోగా నటిస్తున్న కమల్ హాసన్ మాత్రం ఏదో ఒక కారణం చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు.
ఇక వేచి చూడలేమని
ఇన్నాళ్లపాటు వేచి చూడడం తమ వల్ల కాదని భావించిన శంకర్ రాంచరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రాంచరణ్ 15వ సినిమా మొదలు పెట్టారు.. అయితే తమ సినిమా పూర్తి కాకుండానే మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడని చెబుతూ శంకర్ మీద ఇండియన్ నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో రామ్ చరణ్ సినిమా చిక్కుల్లో పడింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ఆయన మరో సినిమా కూడా బాలీవుడ్లో ప్రకటించాడు.
సైలెంట్ గా పని
కొన్నేళ్ల క్రితం విక్రం హీరోగా అపరిచితుడు సినిమా చేయగా అది సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే సినిమాను ఆయన బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అయితే తమ సినిమా విషయం తేల్చకుండా మీ సినిమాలు చేస్తే బాగుండదు అంటూ ఇప్పటికే లైకా ప్రొడక్షన్ సంస్థ తెలుగు ఫిలిం ఛాంబర్ తో సహా హిందీ ఫిలిం ఛాంబర్ కి కూడా లేఖలు రాసింది.. ఈ నేపథ్యంలో శంకర్ కాస్త సైలెంట్ గానే ఉన్నాడు. సైలెంట్ గా రామ్ చరణ్ సినిమా కోసం పని చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది.
సినిమా పనులు నిలిపివేత
అయితే ప్రస్తుతానికి శంకర్ అన్ని పనులు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమా కోసం జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారని అంటున్నారు. ఎందుకంటే శంకర్ ఇప్పుడు తన పెద్ద కుమార్తె అదితి శంకర్ వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అని తెలుస్తోంది. ఇప్పటికే అదితి నిశ్చితార్థం చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో జరిగింది. వచ్చేవారం వీరి వివాహం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరగబోతోంది.
Recommended Video
అలా అయితే భారీ రిసెప్షన్
అయితే కరోనా కారణంగా అది కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్ళి చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గి తమిళనాడులో కనుక కాస్త సడలింపు ఇచ్చినట్లయితే చెన్నైలో ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ పెద్దలు అందర్నీ కూడా శంకర్ ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే శంకర్ కుటుంబం మొత్తం పొల్లాచి చేరినట్లు తెలుస్తోంది. ఆ వివాహ వేడుకలో దగ్గర నుంచి విడుదలైన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.