Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అవన్నీ ఫేక్ కలెక్షన్స్ రిపోర్టులని తేల్చారు
ఆ సినిమాకు అంత సీన్ లేదు..అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ మండిపడుతున్నారు మిగతా హీరోల అభిమానులు. మొన్న శుక్రవారం శంకర్ తాజా చిత్రం నన్బన్ చిత్రం విడుదలైంది. మొదటి మూడు రోజుల్లోనే 57 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని వారు ప్రకటించారు. అయితే ఆ సినిమాకి అంత సీన్ లేదని,నిజంగా ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చాయో చూపిస్తూ ప్రకటించాలని విజయ్ అపోజిట్ హీరోల అభిమాన సంఘాలు గొడవ చేస్తున్నాయి. అక్కడ మీడియోలో అదొక హాట్ టాపిక్ గా మారింది. కేవలం పన్నేటు కోట్లు మాత్రమే వచ్చాయని,దాన్ని దాచిపెట్టి వారు 57 కోట్లు వచ్చాయని అబద్దమాడుతున్నారని ఆరోపిస్తున్నారు.
అయితే ఈ విషయమై దర్సక, నిర్మాతలు మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో డబ్బింగ్ చేసి అందిస్తున్నారు. 'త్రీ ఇడియట్స్' రీమేక్ గా వచ్చిన ఈ చిత్రానికి డబ్బింగ్ టైటిల్ గా 'స్నేహితుడు'అని పెట్టారు. స్నేహితుడు చిత్ర గీతాల్ని ఈ నెల 19న హైదరాబాద్లో విడుదల చేయనున్నారు. హారీస్ జైరాజ్ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 26న చిత్రం విడుదలవుతుంది. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మించింది. విజయ్, ఇలియానా జంటగా నటించారు. జీవా, శ్రీరామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ సైతం అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు.