twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కాంచన'పై కుట్ర అంటూ గోల

    By Srikanya
    |

    నా సినిమాలు తమిళనాడులో విడుదల కాకుండా కుట్ర జరిగింది. శరత్‌కుమార్‌ సినిమా అనగానే థియేటర్లు లేకుండా చేశారు. ఆ కారణంగా చాలా నష్టపోయాం అంటూ వాపోయారు తమిళ నటుడు శరత్ కుమార్.ఆయన రీసెంట్ గా విడుదలైన 'కాంచన' చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శరత్‌కుమార్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే
    'జగ్గూభాయ్‌' సినిమా విడుదలకు ముందే ప్రింటు బయటకు వచ్చేసింది. అదెలా వచ్చిందో ఇంత వరకూ తెలీదు.తమిళంలో అందుకే సినిమాలు తగ్గించాను అన్నారాయన.

    ఇక 'కాంచన' గురించి చెబుతూ ''ఇప్పటి వరకూ వందకు పైగా సినిమాలు చేశాను. హీరోగా, విలన్ గానూ నటించాను. మళ్లీ మళ్లీ అలాంటి పాత్రలు చేయడం నాకే నచ్చడం లేదు. వైవిధ్యభరితమైన పాత్రల కోసమే ఎదురుచూస్తున్నాను. లారెన్స్‌ వచ్చి 'కాంచన' పాత్ర గురించి నాకు చెప్పగానే ఇదో సవాల్‌గా అనిపించింది. పైగా మంచి సందేశం ఇవ్వాలనుకొన్నారు. అందుకే నటించాను. ఎప్పుడూ ఇన్ని ప్రశంసలు దక్కలేదు అని మురసిపోతూ చెప్పారు.

    English summary
    Sarath said that he simply performed his duties as an actor.“I always love to take on challenging roles. I’m very happy that the audiences have taken a huge liking to my role in Kanchana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X