Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రియకు నిర్మాతల మండలి...ఐదు లక్షల ఫైన్
అడ్వాన్స్ తీసుకుని సినిమా డేట్స్ ఎడ్జెస్టు చేయనందుకు తమిళ నిర్మాతల మండలి శ్రియకు అసలు, వడ్డీతో కలిపి 15లక్షలు తక్షణమే చెల్లించాలని తీర్పు చెప్పింది. ఆ కంప్లైంట్ పూర్వా పరాలు ఇలా ఉన్నాయి.'పొల్లాదవన్"(తెలుగులో కుర్రాడు) అనే సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించిన తమిళ నిర్మాత కథిరేశన్ శ్రియకు సినిమా చేయాలంటూ 10లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పటికి అది అందుకున్న శ్రియ తర్వాత ఆ నిర్మాతకు డేట్స్ ఇవ్వలేదు. సరికదా విషయం తేల్చకుండా తిప్పించుకోసాగింది. దాంతో విసిగి వేసారిన ఆయన తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసారు. సినిమా చేయకపోయినా ఫర్లేదు తన అడ్వాన్స్ తనకు ఇవ్వమని కోరితే శ్రియ వేపు నుంచి స్పందన లేదని ఆ కంప్లైంట్ లో వివరించారుచ. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట అసలు, వడ్డీ కలిపి 15లక్షలు శ్రీయ సదరు నిర్మాతకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చారు. శ్రియ ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక శ్రియ ప్రస్తుతం పవన్ కళ్యాణ్...పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే రవితేజ హీరోగా రూపొందుతున్న 'డాన్ శీను'లోనూ హీరోయిన్ గా చేస్తోంది.