Don't Miss!
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శ్రియకు నిర్మాతల మండలి...ఐదు లక్షల ఫైన్
అడ్వాన్స్ తీసుకుని సినిమా డేట్స్ ఎడ్జెస్టు చేయనందుకు తమిళ నిర్మాతల మండలి శ్రియకు అసలు, వడ్డీతో కలిపి 15లక్షలు తక్షణమే చెల్లించాలని తీర్పు చెప్పింది. ఆ కంప్లైంట్ పూర్వా పరాలు ఇలా ఉన్నాయి.'పొల్లాదవన్"(తెలుగులో కుర్రాడు) అనే సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించిన తమిళ నిర్మాత కథిరేశన్ శ్రియకు సినిమా చేయాలంటూ 10లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పటికి అది అందుకున్న శ్రియ తర్వాత ఆ నిర్మాతకు డేట్స్ ఇవ్వలేదు. సరికదా విషయం తేల్చకుండా తిప్పించుకోసాగింది. దాంతో విసిగి వేసారిన ఆయన తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసారు. సినిమా చేయకపోయినా ఫర్లేదు తన అడ్వాన్స్ తనకు ఇవ్వమని కోరితే శ్రియ వేపు నుంచి స్పందన లేదని ఆ కంప్లైంట్ లో వివరించారుచ. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట అసలు, వడ్డీ కలిపి 15లక్షలు శ్రీయ సదరు నిర్మాతకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చారు. శ్రియ ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక శ్రియ ప్రస్తుతం పవన్ కళ్యాణ్...పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే రవితేజ హీరోగా రూపొందుతున్న 'డాన్ శీను'లోనూ హీరోయిన్ గా చేస్తోంది.