Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రిషకు టెండర్ పెట్టిన శ్రియ..శ్రియకు చెక్ పెట్టిన జీవా..
ఒకళ్ల సినిమాని మరొకళ్లు కొట్టేయడం అప్పుడప్పుడు మన సినిమా రంగంలో జరుగుతూనే వుంటుంది. కారణాలు ఏమైనా మొదట్లో ఒకర్ని ఎంపిక చేసుకున్నాక...మరొకళ్లు ఆ స్థానంలోకి వస్తుంటారు. ఇప్పుడు త్రిష విషయంలో కూడా అలాగే జరిగింది. 'హీరో' అనే మలయాళ సినిమాలో ముందుగా త్రిషాని కథానాయికగా బుక్ చేశారు. అయితే, ఆమె స్థానంలో ఇప్పుడు శ్రియా వచ్చి చేరింది. త్రిషాకి డేట్స్ సమస్య రావడం వల్ల ఈ సినిమా చేయలేకపోయిందని అంటున్నారు. అయితే, పారితోషికం విషయంలో తేడా రావడం వల్లే త్రిషని డ్రాప్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రియాకి మలయాళంలో ఇది మూడో సినిమా. పృద్వీరాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో మొదలవుతుంది.
కాగా 'రంగం" సినిమాతో తెలుగునాట మంచి పేరు తెచ్చుకున్న జీవా తమిళంలో అయితే వరుస విజయాలతోదూసుకుపోతున్నాడు. అతని సరసన రౌద్రం సినిమాలో నటించిన శ్రియ అటు తమిళం, ఇటు తెలుగు రెండిట్లోనూ ఇదే సినిమాతో తిరిగి సత్తా చాటుకోవాలని చూసింది అయితే ఫామ్ లో ఉన్న జీవా కూడా శ్రియకి ప్లాపే ఇచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో శ్రియ భోరుమంటోంది. తెలుగులోకి రౌద్రం పేరుతోనే అనువాదమైన ఈ చిత్రం ఇంకా ఇక్కడ విడుదల కాలేదు. దడ, కందిరీగ ఉన్నాయని ఈ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు తమిళంలో మంచి టాక్ లేకపోవడంతో తెలుగులో విడుదలయ్యే సూచనలు కనిపించడంలేదు.