Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆడియో పంక్షన్ కి కమల్ హాసన్ గెస్ట్
చెన్నై : త్వరలో కమల్ హాసన్ ఓ ఆడియో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా రావటానికి అంగీకరించారు. దాంతో ఆ చిత్రం యూనిట్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. ఇంతకీ ఆయన వెళ్ళబోయే... ఆడియో పంక్షన్ ఏమిటీ అంటే.... తమిళ హీరో విక్రమ్ ప్రభు నటించిన 'శిఖరం తొడు'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆగస్టు ఏడో తేదీన చెన్నైలో నిర్వహించనున్నారు.
'కుమ్కీ', 'అరిమా నంబి' వంటి వరుస చిత్రాల్లో విజయానందుకొన్నారు విక్రం ప్రభు.. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'శిఖరం తొడు'. 'తూంగానగరం' ఫేం గౌరవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రం ప్రభుకు జంటగా మోనాల్ గజ్జర్, ఇమాన్ సంగీతం సమకూర్చారు. కమర్షియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'విశ్వనటుడు' కమల్హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో విడుదల చేయనున్నారు.
నిర్మాతమ మాట్లాడుతూ... విక్రంప్రభు యాక్షన్ తమిళ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ చిత్రాలకు ఆయన పూర్తి స్థాయిలో నప్పుతారు. అలాంటి నేపథ్యంతోనే 'శిఖరం తొడు'ను తెరకెక్కించాం. ఇమాన్ సంగీతం మరో హైలెట్గా ఉంటుంది. మోనాల్ గజ్జర్ కథలో కీలకపాత్ర పోషించారు. యాక్షన్, కమర్షియల్ ప్రియులను ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని పేర్కొన్నాయి.