Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రంగంలోకి రాధిక.. మరో సంచలన బయోపిక్, కాల్పుల వ్యవహారం చూపిస్తారా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ పరిశ్రమ తీసుకున్న ప్రముఖుల జీవితాలపై సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో మరో సంచలన బయోపిక్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఒకప్పుడు తమిళనాట ప్రముఖ నటుగా వెలుగొందిన ఎంఆర్ రాధ జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. ఎంజీఆర్, శివాజీ గణేశన్ హయాంలో ఎంఆర్ రాధ విలన్ పాత్రలతో పాపులర్ అయ్యారు. ఎంఆర్ రాధ మరెవరో కాదు... సౌత్ ఇండియాలో ప్రముఖ యాక్టర్లుగా వెలుగొందుతున్న రాధిక శరత్ కుమార్, రాధా రవి, నిరోషా తండ్రి.
శింబు, అరవింద స్వామి ముఖ్య పాత్రల్లో
ఎంఆర్ రాధ బయోపిక్లో తమిళ స్టార్స్ శింబు, అరవింద స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంఆర్ రాధ పాత్రలో శింబు, ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటించే అవాకశం ఉందని టాక్. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
రాధిక శరత్ కుమార్ సొంత బేనర్లో
తన తండ్రి బయోపిక్ రాధిక శరత్ కుమార్ తన సొంత బేనర్ రాడాన్ మీడియా వర్క్స్ సంస్థపై నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంఆర్ రాధ మనవడు ఐకీ రాధ ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాతయ్య బయోపిక్ తీయబోతున్నట్లు ఐకీ గురువారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఐకీ ఇంతకు ముందు తమిళంలో ‘సంగిలి బుంగిలి' అనే చిత్రం చేశారు.
ఎంఆర్ రాధపై బ్యాడ్ ఇమేజ్ వాస్తవం కాదు
దర్శకుడు
ఐకీ
ఓ
ఇంటర్వ్యూలో
మాట్లాడుతూ...‘తాతయ్య
ఎంఆర్
రాధలోని
డిఫరెంట్
కోణం
చూపించబోతున్నాను.
కొన్ని
వివాదాల
కారణంగా
ఆయనపై
నెగెటివ్
ఇమేజ్
క్రియేట్
అయింది.
ఆయన్ను
అంతా
చెడ్డవాడు
అనుకుంటున్నారు.
అది
వాస్తవం
కాదు.
ఆయనలోని
అసలు
కోణం
చూపేందుకే
ఈ
బయోపిక్
ప్లాన్
చేస్తున్నట్లు
తెలిపారు.
కాల్పుల వ్యవహారం చూపిస్తారా?
ఎంఆర్ రాధ అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్గా వెలుగొందుతున్న ఎంజీఆర్పై కాల్పులు జరపడం సంచలనం అయింది. మరి ఈ బయోపిక్లో ఈ సంఘటన చూపిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంఘటన తర్వాతే ఎంఆర్ రాధ మీద నెగెటివిటీ పెరిగిపోయింది. ఐకీ తన చిత్రంలో ఈ సంఘటన వెనక కారణాలు చూపించే అవకాశం ఉంది.
ఎంఆర్ రాధ
1907లో జన్మించిన ఎంఆర్ రాధ 1930 నుంచి 1970 మధ్య తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా వెలుగొందారు. ఆయనకు మొత్తం ఐదుగురు భార్యలు. 9 మంది సంతానం. వీరిలో ఎంఆర్ఆర్ వాసు, రాధా రవి, రాధిక, నిరోష సినీరంగంలో స్థిరపడ్డారు.