Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
త్రిషతో మూడోసారి చేస్తున్నాడు !
శింబు - త్రిష జంటగా గతంలో 'అలై', 'విన్నైతాండి వరువాయా' వచ్చాయి. వీటిలో 'విన్నైతాండి వరువాయా' సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కి వీరి జంటకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇది విడుదలై నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్య - అనుష్క జంటగా 'ఇరండాం ఉళగం' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించి చేతులు కాల్చుకున్న సెల్వరాఘవన్ ప్రస్తుతం ఓ లోబడ్జెట్ చిత్రాన్ని రూపొందించటంపై దృష్టి సారించారు.
హీరోగా శింబును ఎంచుకున్న ఆయన... త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేశారు. గతంలో వీరి జంటకు చక్కని పేరు ఉండటంతో తన కొత్త చిత్రానికి అది కలిసొస్తుందనే ధీమాలో సెల్వరాఘవన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలుగులో విషయానికి వస్తే... ఎమ్.ఎస్.రాజు స్వీయ దర్శకత్వంలో'రంభ ఊర్వశి మేనక' ('రమ్' )అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, నికీషా పటేల్, ఇషా చావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఫైనాన్సియల్ క్రైసిస్ లో ఇరుక్కుని ఆగిపోయింది. ఈ చిత్రం మేజర్ షెడ్యూల్స్ రెండు జరిగి మూడో షెడ్యూల్ వద్ద ఆగిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా ఆర్దిక ఇబ్బందులు రావటంతో ఎమ్.ఎస్ రాజు చేతులెత్తేసారని చెప్పుకుంటున్నారు.