twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడిగా శింబు... కమెడియన్‌ను హీరోగా పెట్టి మూవీ!

    |

    తమిళ స్టార్ శింబు ప్రస్తుతం 'మానాడు' అనే చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ హీరో త్వరలో దర్శకుడిగా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కథ కూడా అతడే రాస్తున్నాడట. తాను కేవలం నటుడిని మాత్రమే కాదు.. మల్టీ టాలెంటెడ్ స్టార్ అని నిరూపించుకోవడానికే శింబు సంగీత దర్శకుడిగా, రచయితగా, దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

    తమిళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.... ఈ ఏడాది చివరకల్లా కథను పూర్తి చేసి 2020లో సినిమా ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. శింబుతో పాటు అతడికి సమానమైన పాత్రలో సంతానం నటింబోతున్నట్లు తెలుస్తోంది.

    సంతానంతో శింబుకు క్లోజ్ రిలేషన్ ఉంది. అతడిలోని టాలెంటును గుర్తించి 2004లో తన 'మన్మదన్' సినిమాలో మంచి పాత్ర ఇప్పించాడు. ఆ తర్వాత 'వల్లవలన్' చిత్రంలోనూ ముఖ్య పాత్రకు ఎంపిక చేశాడు. ఇపుడు తన స్వీయ దర్శకత్వంలో చేసే చిత్రంలో తనతో సమానమైన పాత్రను ఇవ్వబోతున్నాడు.

    Simbu wearing directors cap

    ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా రాణించిన సంతానం... ఇపుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. అందుకే శింబు కూడా అతడి స్థాయిని తగ్గించకుండా తనతో సమానమైన పాత్రను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మానాడు' అనే చిత్రం చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత 'సింగం' ఫేం హరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు సమాచారం.

    English summary
    Simbu will be wearing director's cap again. The multifaceted talent is planning a movie, which will be written and directed by himself. He is going to team up with Santhanam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X