Don't Miss!
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
దర్శకుడిగా శింబు... కమెడియన్ను హీరోగా పెట్టి మూవీ!
తమిళ స్టార్ శింబు ప్రస్తుతం 'మానాడు' అనే చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ హీరో త్వరలో దర్శకుడిగా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కథ కూడా అతడే రాస్తున్నాడట. తాను కేవలం నటుడిని మాత్రమే కాదు.. మల్టీ టాలెంటెడ్ స్టార్ అని నిరూపించుకోవడానికే శింబు సంగీత దర్శకుడిగా, రచయితగా, దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
తమిళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.... ఈ ఏడాది చివరకల్లా కథను పూర్తి చేసి 2020లో సినిమా ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. శింబుతో పాటు అతడికి సమానమైన పాత్రలో సంతానం నటింబోతున్నట్లు తెలుస్తోంది.
సంతానంతో శింబుకు క్లోజ్ రిలేషన్ ఉంది. అతడిలోని టాలెంటును గుర్తించి 2004లో తన 'మన్మదన్' సినిమాలో మంచి పాత్ర ఇప్పించాడు. ఆ తర్వాత 'వల్లవలన్' చిత్రంలోనూ ముఖ్య పాత్రకు ఎంపిక చేశాడు. ఇపుడు తన స్వీయ దర్శకత్వంలో చేసే చిత్రంలో తనతో సమానమైన పాత్రను ఇవ్వబోతున్నాడు.
ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా రాణించిన సంతానం... ఇపుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. అందుకే శింబు కూడా అతడి స్థాయిని తగ్గించకుండా తనతో సమానమైన పాత్రను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మానాడు' అనే చిత్రం చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత 'సింగం' ఫేం హరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు సమాచారం.