Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
తమిళంలో 'యు' తెలుగులో 'ఎ'
చెన్నై : ప్రాంతీయపరంగా పొరుగు రాష్ట్రాల అభిరుచులు ఒకేలా ఉంటాయని కొన్ని సినిమాలు రుజువు చేస్తుంటాయి. కొన్ని చిత్రాలు ప్రాంతీయతకు తగ్గట్టుగా మారాల్సిందేనని చెబుతుంటాయి. తమిళ ప్రేక్షకులతో పోలిస్తే.. తెలుగు సినీజనాలు కాస్త అందాల ఆరబోత సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తారని తెలిసిందే. ఆ విషయాన్ని 'వరుత్తపడాద వాలిబర్ సంఘం' రుజువుచేస్తోంది.
తెలుగు వెర్షన్ చిత్రం ఇటీవల సెన్సార్కు వెళ్లొచ్చింది. సినిమా చూశాక.. 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చారు అధికారులు. అయితే అన్నివర్గాల ప్రేక్షకులు చూసేలా తమిళంలో ఈ చిత్రానికి 'యు' సర్టిఫికేట్ ఇచ్చారు. పలు గ్లామర్ సన్నివేశాలను చిత్రంలో చేర్చినందువల్లే 'ఎ' సర్టిఫికేట్ వచ్చిందని సమాచారం. సెక్సీతార సన్నీలియోన్ అందాల ఆరబోత కూడా ఓ కారణమని తెలుస్తోంది.
శివ కార్తికేయన్, శ్రీదివ్య, సత్యరాజ్, సూరి తదితరులు నటించిన ఈ సినిమా కొన్ని నెలల కిందట పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో 'కరెంటుతీగ'గా రీమేక్ అవుతోంది. మనోజ్, రాహుల్ ప్రీతిసింగ్ జంటగా నటిస్తున్నారు. సత్యరాజ్ పాత్రలను జగపతిబాబు పోషిస్తున్నారు.
'కరెంటుతీగ' దర్శకుడు మాట్లాడుతూ...'కరెంటు తీగలాంటి యువకుడి కథ ఇది. టైటిల్కి అతికినట్టు సరిపోయే క్యారెక్టర్ మనోజ్ది. అతని సినిమా అంటేనే ఆద్యంతం హుషారుగా సాగిపోతుంది. 'కరెంట్ తీగ' అంతే. 'దర్శకుల పనిలో మనోజ్ జోక్యం చేసుకొంటాడు' అంటుంటారు. ఇంటిల్లిపాదీ చూసే సంపూర్ణ వినోదాత్మక చిత్రమిది. జగపతిబాబు పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకొంటాయి. రకుల్ప్రీత్సింగ్ కథకి ప్రాణం పోసింది అన్నారు
అలాగే... సన్నీలియోన్ని చీరకట్టులో చూపించాం. ఓ పాటలో మరీ హాట్గా కనిపిస్తుంది. ఈ సినిమాకి మొదటి ప్రేక్షకుడు మోహన్బాబు గారే. ఆయనకు ఈ సినిమా బాగా నచ్చింది''అన్నారు '' అన్నారు నాగేశ్వరరెడ్డి.