Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తో శివకార్తికేయన్ మూవీ సెట్.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్?
ఈ మధ్య కాలంలో తెరమీదకు వస్తున్న క్రేజీ కాంబినేషన్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తమిళ హీరోలతో తెలుగు దర్శకులు - తెలుగు దర్శకులతో తమిళ హీరోలు అంటూ రచ్చ రచ్చగా ఉంది పరిస్థితి. తాజాగా అలాంటి ఒక కాంబో సెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
ధనుష్ రెండు సినిమాలు
తమిళ స్టార్ హీరో ధనుష్ మొదలు ఇతర తమిళ హీరోలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొద్ది రోజుల క్రితం ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక ట్రై లింగ్యువల్ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ధనుష్ మరో తెలుగు సినిమా ఒప్పుకున్నట్లే అని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరితో ఆయన సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంకా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు.
తమిళ హీరోలు ఫ్లాట్
ఇక తెలుగు దర్శకులు చెబుతున్న కథలకు తమిళ హీరోలు అందరూ ఫ్లాట్ అవుతున్నారు. ఇప్పటికే విజయ్ తలపతి- వంశీ పైడిపల్లి, ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్లలో సినిమాలు ఖరారు అయ్యాయి. అదే తరహాలో మరో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అనుదీప్ శివ కార్తికేయన్ కి కధ చెప్పినట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాని కూడా ఆ బ్యానరే
ద్విభాషా చిత్రంగా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోన్న ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయినట్టు చెబుతున్నారు. ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమాని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఈ సినిమాని కూడా నిర్మించే అవకశం ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
ఏకంగా 25 కోట్లు
ఈ చిత్ర కథాంశాన్ని శివకార్తికేయన్ ఇష్టపడుతున్నందున, ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి తక్షణమే అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు గాను ఆయన తీసుకునే రెమ్యునరేషన్ అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ద్విభాషా సినిమా చేసేందుకు గాను ఆయనకు రెమ్యునరేషన్ గా 25 కోట్ల మొత్తం లభిస్తుందని తెలుస్తుంది. దర్శకుడికి తెలుగులో ఉన్న మార్కెట్ కు తగ్గట్టుగా హీరోకి తమిల్ మార్కెట్ ఉంటుంది. అందుకే నిర్మాతలు అంత ఇవ్వడానికి సిద్దం అయ్యారని అంటున్నారు.
జాతిరత్నాలు సీక్వెల్
ఇక మరో పక్క జాతిరత్నాలు సీక్వెల్ కూడా సిద్ధం చేసే పనిలో దర్శక నిర్మాతలు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఒక ముగ్గురు స్నేహితులు ఒక పట్టణం నుంచి హైదరాబాద్ కి పొట్టకూటి కోసం వస్తే ఎలా ఉంటుంది ? వారు ఇక్కడికి వచ్చి ఎలాంటి పనులు చేస్తారు ? అనే కోణంలో జాతిరత్నాలు సినిమా నడిచింది. ఇప్పుడు ఇదే ముగ్గురు అమెరికా వెళితే పరిస్థితి ఏమిటి అనే కోణంలో ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది.