Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మానభంగ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గాయకుడి కొడుకు...!?
ప్రముఖ గాయకుడు యస్ పి బాలసుబ్రహ్మణ్యం కొడుకు యస్ పి బి చరణ్ తనను మానభంగం చేసేందుకు ప్రయత్నించాడంటూ సోనా అనే తమిళ నటి చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆరోపణ చేసేందుకే ఆమె నిన్న చెన్నైలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టింది. 'మంకత" సినిమా విజయం సాధిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు స్నేహితులు ఇచ్చిన పార్టీకి హాజరైన తనపై యస్ పి బి చరణ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని సోనా బహిరంగంగా ఆరోపించింది.
అంతే కాదు..యస్ పి బి చరణ్ చేయబోయిన నిర్వాకానికి వెంకట్ ప్రభు కూడా మద్దతు పలికాడని..దుశ్చర్యకు పాల్పడుతున్న చరణ్ ను అడ్డగించకపోగా..అతనికి వత్తాసు పలుకుతూ ..తనను వెంకట్ ప్రభు దుర్భాషలాడాడని సోనా ఆరోపించింది...ఈ సంఘటనపై యస్ పి బి చరణ్ మరియు వెంటక్ ప్రభు తక్షణం బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే..తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తమకున్న పలుకుబడితో వారు కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తే..ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడతానని సోనా హెచ్చరించింది...!