Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అఫీషియల్: రజనీకాంత్ కూతురుకు విడాకులొచ్చేశాయ్!
రజనీకాంత్ కూతురుకు విడాకులు మంజూరయ్యాయి. చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం వీరికి విడాకులు మంజూ చేసింది.
రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య తన భర్త, చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్తో కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లోనే ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుండి వారికి మంగళవారం అఫీషియల్గా విడాకులు మంజూరయ్యాయి.
సౌందర్య-అశ్విన్ వివాహం 2010లో జరిగింది. దాదాపు ఐదేళ్ల పాటు అన్యోన్య దాంపత్యం సాగించారు. 2015లో వారికి ఒక బిడ్డ పుట్టాడు. కొడుకు తొలిపుట్టినరోజు సందర్భంగా ఏర్పడిన చిన్న వివాదం చిలికి చిలికి పెద్దగొడవకు దారి తీసి ఇద్దరూ విడిపోయే పరిస్థితులకు దారితీసింది.
రజనీ కుటుంబ సభ్యులు ఇద్దరినీ కలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్న సౌందర్య... ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీనే తన కెరీర్ గా ఎంచుకుని ముందుకు సాగుతోంది.
సౌందర్య రజినీకాంత్ 'కొచ్చాడియన్' సినిమాతో డైరెక్టర్ పరిచయం అయ్యారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా వీఐపీ2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.