Don't Miss!
- Technology 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- News ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విషాదంలో ప్రముఖ దర్శకుడు.. తండ్రి మరణంతో శోకసంద్రంలో..
ప్రముఖ దర్శకుడు సిరుతాయ్ శివ విషాదంలో మునిగిపోయారు. అనారోగ్యంతో తన తండ్రి జయకుమార్ అకాల మరణం పొందడంతో శివ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. జయకుమార్కు శివ, బాల ఇద్దరు కుమారులు. భార్య ఉన్నారు.
జయకుమార్ విషయానికి వస్తే ప్రముఖ తమిళ నిర్మాత ఏకే వేలన్కు కుమారుడు. ఆయన డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్గా అందరికి సుపరిచితులు. తండ్రి అడుగు జాడల్లోనే శివ తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్గా గుర్తింపు పొందారు. సినిమాటోగ్రాఫర్గా ఉంటూనే శివ దర్శకుడిగా మారారు.
పితృవియోగంతో బాధపడుతున్న శివకు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సిరుతాయ్ శివ కెరీర్ విషయానికి వస్తే.. 2008లో శౌర్యం సినిమాతో దర్శకుడిగా మారారు. శంఖం, దరువు చిత్రాలకు ధర్శకత్వం వహించారు. తమిళంలో సిరుతాయ్ చిత్రంతో తమిళంలో పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి సిరుతాయ్ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.
అజిత్తో వీరమ్, వేదాళం, వివేగమ్, విశ్వాసం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రజనీకాంత్తో అన్నాతే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమాటోగ్రాఫర్గా శ్రీరాం, మనసు మాట వినదు. గౌతమ్ ఎస్ఎస్సీ, బాస్ చిత్రాలకు పనిచేశారు.