Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాప్ హీరో కన్నా హీరోయిన్ మీదే స్సెషల్ ఫోకస్..!?
విక్రమ్, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'నాన్నా" సినిమా త్వరలో విడుదలకు సిద్దమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో అమలా పాల్ అనే మరో మీరోయిన్ కూడా నటిస్తున్నప్పటికీ ఆమె పేరు ఎక్కడా వినిపించడంలేదు. సినిమా పబ్లిసిటీకి సంబంధించినంతవరకు. ప్రస్తుతం కోలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ అనుష్క చుట్టూనే సినిమా పబ్లిసిటీ జరుగుతుండడం గమనార్హం. ఆ మాటకొస్తే విక్రమ్ కన్నా అనుష్క ఫోటోలనే పబ్లిసిటీలో ప్రముఖంగా వినియోగిస్తున్నారు.
తెలుగు తమిళ పరిశ్రమల్లో ఆల్రెడీ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అనుష్క, 'నాన్న" సినిమా పబ్లిసిటీలో తనకు దక్కుతోన్న ప్రాధాన్యతను చూసి ఉబ్బతబ్బిబ్బవుతోంది. ఇప్పటిదాకా చేయని భిన్నమైన పాత్రను 'నాన్న"లో తాను చేస్తున్నట్టు చెబుతోన్న అనుష్క, నటుడిగా విక్రమ్ విశ్వరూపాన్ని 'నాన్న" సినిమా లో చూడొచ్చని చెబుతోంది. మరోపక్క, విక్రమ్ కూడా అనుష్క నటనకు ప్రేక్షకులు ప్లాటయిపోతారంటూ అనుష్కని ఆకాశానికెత్తేస్తున్నాడు. ఏదిఏమైనా, తమిళంలో టాప్ హీరో ఇమేజ్ వున్నా, విక్రమ్ కన్నా పబ్లిసిటీ విషయంలో అనుష్కపై దర్శక నిర్మాతలు స్పెషల్ ఫోకస్ పెట్టడం విశేషమే మరి.