ఇదే నా ఆఖరు సినిమా....నయనతార
పెళ్ళయ్యాక నటించకూడదని అన్నాడు ప్రభుదేవా. నేను కూడా ఆలోచించిస్తే...తను చెప్పింది కూడా కరెక్టేగా అనిపించింది. అందుకే పెళ్లయ్యాక నటించకూడదు అనే నిర్ణయానికి వచ్చాను. బహూసా..బాపు దర్శకత్వంలో నేను చేస్తున్న శ్రీరామరాజ్యం తర్వాత నటించను. ఇదే నా ఆఖరు సినిమా అవుతుంది అంటోంది నయనతార. ఆమె రీసెంట్ గా ఓ మీడియా వెబ్ సైట్ తో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే శ్రీరామరాజ్యం షూటింగ్ పూర్తయ్యాక పెండ్లిచేసుకుంటానని చెప్పింది. ఇక వివాహం తర్వాత జీవితం గురించి చెబుతూ..ఓ గృహిణిగానే ఉంటాను. నిర్మాతగా మారాలంటే చాలా కష్టం. మెంటల్ టెన్షన్..దాన్ని నేను భరించలేను. మంచి భార్యగా ఉండాలనేది నా కోరిక. అంటూ చెప్పుకొచ్చింది. ఇక శ్రీరామ రాజ్యం చిత్రంలో ఆమె సీతగా బాలకృష్ణ సరసన చేస్తోంది. సింహా తర్వతా బాలకృష్ణతో చేస్తున్న చిత్రం ఇది.
More from Filmibeat
నయనతార నేనే అంబాని రామరాజ్యం అదుర్స్ లక్ష్మీ తులసి nayantara nene ambanai rama rajyam simha tulasi laxmi adurs


Click it and Unblock the Notifications











