Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విశాల్ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. అంత డబ్బు ఎక్కడిదంటూ.. ఆ దర్శకుడికి మద్దతుగా పోస్ట్
విశాల్-శ్రీ రెడ్డి మధ్య ఉన్న గొడవ గురించి అందరికీ తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంలో భాగంగా విశాల్పై ఆరోపణలు చేసి సంచలనానికి దారి తీసింది. అయితే అదంతా కాసేపు పక్కన పెడితే.. గత కొన్ని రోజలుగా దర్శకుడు మిస్కిన్కు, హీరో విశాల్కు మధ్య జరుగుతున్న వార్ గురించి తెలిసే ఉంటుంది. వీరి కాంబినేషన్లో అంతకు ముందు వచ్చిన తుప్పరివాలన్ (డిటెక్టివ్) ఘన విజయం సాధించడంతో, దానికి సీక్వెల్ ప్లాన్ చేశారు. ఈ మూవీ విషయంలో ఇద్దరికీ చెడింది. ఈ వివాదంలో శ్రీరెడ్డి దూరింది. ఇంతకీ ఏం జరిగింది? శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి? అసలు వాటి సంగతేంటో ఓ సారి చూద్దాం.
బడ్జెట్ను వృథా..
కథ, స్క్రిప్ట్ రాయడానికి కెనడా, యూకేలకు వెళ్లే దర్శకుడిని చూసే ఆశ్చర్యపోయానని విశాల్ చెప్పుకొచ్చాడు. దాదాపు 35 లక్షలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టేసి ఓ ప్లానింగ్, లొకేషన్స్ సెలెక్ట్ చేయకుండా షూటింగ్ మొదలెట్టేసి.. దాదాపు 13 కోట్లు వృథాగా ఖర్చు పెట్టించే దర్శకుడు అవసరమా అంటూ మిస్కిన్ను తొలగించడానికి గల కారణాలను వివరించాడు విశాల్.
విశాల్పై సెటైర్లు..
తనను తుప్పరివాలన్ 2 నుంచి తప్పించడంపై మిస్కిన్ కౌంటర్లు వేశాడు. తాను సినిమా కోసం 40కోట్లు అడగలేదని 400కోట్లు అడిగానని, సెటైర్లు వేశాడు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్కు 400కోట్లు అడిగానని సెటైరికల్ కామెంట్స్ చేశాడు. దీనిపై విశాల్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
దర్శకుడిగా మారిన హీరో..
ఈ గొడవంతా ఇలా చెప్పడానికి కారణం.. ఒకరిని ప్రతిష్టను తగ్గించేందుకు మాత్రం కాదని తెలిపాడు. నిర్మాతల కష్టాలు, కొత్తగా వచ్చే నిర్మాతలు తెలుసుకుంటారని చెబుతున్నానంటూ పేర్కొన్నాడు. ఇలా మరో నిర్మాతకు ఎదురు కాకూడదని, మధ్యలో చిత్రాన్ని వదిలేయలేక తానే దర్శకత్వం వహిస్తున్నానని తెలిపాడు. డైరెక్టర్గా తన తొలి ప్రయత్నానికి అందరి ఆశీర్వాదం కావాలని, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశాడు.
Recommended Video
మధ్యలో ఎంటరైన శ్రీ రెడ్డి..
ఇక్కడి వరకు ఈ వ్యవహరం అంతా సద్దుమణిగినట్టు కనిపించింది. కానీ తాజాగా మధ్యలో శ్రీ రెడ్డి ఎంటరైంది. తన మద్దతు ఎల్లప్పుడూ దర్శకులకే ఉంటుందని, ఈ సారి తన సపోర్ట్ మిస్కిన్కేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా విశాల్ను టార్గెట్ చేసింది. ఇంత డబ్బు ఎలా సంపాదించావంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.