twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నం డైరెక్షన్ లో శ్రీదేవి కూతురితో ఓ రొమాంటిక్ లవ్ స్టోరి...!

    By Sindhu
    |

    భారీ బడ్జెట్ చారిత్రాత్మక చిత్రం 'పోన్నియిన్ సెల్వం' ను పక్కన పెట్టేశాక, మణిరత్నం తీసే సినిమా ఏమిటా... అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మణి ఓ రొమాంటిక్ స్టోరీని తీయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా పలువురు కొత్త నటీనటుల్ని ఆయన పరిచయం చేయనున్నాడన్న విషయం తెలిసిందే

    శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్‌ గా నటించేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్‌ లోకి త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ చేయనుంది. శ్రీదేవి...పరిచయం అక్కర్లేని అతిలోక సుందరి. వయసు పెరుగుతున్నా జస్ట్ సిక్స్టీన్ అన్నట్టుండే సౌత్ బ్యూటీ. ఇద్దరి బిడ్డలకు తల్లి... అయినా ఆమె అందం కమనీయం. శ్రీదేవి రీ ఎంట్రీ సంగతేమో కాని... తన పెద్ద కూతురు జాహ్నవిని హీరోయిన్ చేసేందుకు రంగం సిద్ధమైందట. అదీ కూడా రియలిస్టిక్ డైరెక్టర్ మణిరత్నం చేతిలో పడితే తన కూతురి రీల్ లైఫ్ కెరీర్ రాకెట్ వేగంతో దూసుకుపోతుందని శ్రీదేవి బావిస్తోంది.

    అటు మణి రత్నం కూడా నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ తో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అతడి సరసన నయా హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్న మణికి శ్రీదేవి ప్రపోజల్ ఫుల్ గా నచ్చి ఓకే చెప్పేశాడట. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈమూవీ... త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. మరి మిని శ్రీదేవి అమ్మలా ఎంత హగామా సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి.

    English summary
    The latest buzz is, recently Kollywood director Mani Ratnam has agreed to give her daughter a chance in his upcoming movie. It is learnt that, Kollywood actor Karthik's son and Sridevi’s daughter Jahnavi will play the lead roles in that movie to be directed by Mani Ratnam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X