Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దక్షిణాదికి జాన్వీ కపూర్.. స్టార్ హీరోకు కూతురిగా చేయడానికి గ్రీన్ సిగ్నల్
అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురిగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేక గుర్తుంపును తెచ్చుకుంది జాన్వీ కపూర్. తల్లి బతికున్నప్పుడే తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగులో పాల్గొంటోంది. తాజాగా ఆమె మరో సినిమాను ఓకే చేసేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలకే పరిమితమైన జాన్వీ కపూర్.. తాజాగా ఓ దక్షిణాది సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. యంగ్ డైరెక్టర్ వినోద్ - కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కాంబినేషన్లో రానున్న సినిమా ద్వారా ఆమె దక్షిణాదిలో అడుగుపెట్టబోతుంది. ఈ సినిమాలో అజిత్ బైక్ రెసర్గాను, నడి వయస్సు పాత్రలో నటించనున్నారు. అలాగే, జాన్వీ ఆయనకు కూతురిగా కనిపించనుంది. ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం అజిత్ నటించిన బాలీవుడ్ 'పింక్' రీమేక్ 'నెర్కొండ పార్వాయి' ఆగస్టు 10న విడుదల కానుంది. అక్కడ అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ అజిత్ చేస్తున్నారు. విద్యాబాలన్, ఆండ్రియా, ఆదిక్ రవిచంద్రన్, శ్రద్ధ శ్రీనాథ్, రంగరాజ్ పాండే తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలోనే అజిత్ మరో సినిమా కూడా పట్టాలెక్కేస్తుంది. జాన్వీ కూడా త్వరలోనే షూటింగ్లో పాల్గొంటుందని కోలీవుడ్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ 'రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే, 'దోస్తానా 2' సినిమాలోనూ చేస్తోంది.