Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కె.బాలచందర్కు విగ్రహం...వీధికి పేరు
చెన్నై : 'దర్శక శిఖరం' కె.బాలచందర్కు మైలాపూర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దర్శకుడు భారతీరాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమిళ చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో సంతాపసభ మంగళవారం నిర్వహించింది. సంఘం అధ్యక్షుడు విక్రమన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలచందర్ చిత్రపటాన్ని భారతీరాజా ఆవిష్కరించారు.
అనంతరం భారతీరాజా మాట్లాడుతూ.. బాలచందర్ మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జీవించిన మైలాపూర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. వారు నివసించిన వీధికి 'బాలచందర్' పేరు పెట్టాలని కోరారు. ఇకపై బాలచందర్ను జ్ఞప్తికి తెచ్చుకునేలా ప్రతి ఏటా ఆయన పేరిట అవార్డును కూడా అందజేయనున్నట్లు చెప్పారు. బాలచందర్ ఖ్యాతిని చాటే రీతిలో ఫిబ్రవరిలో వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సందర్భంగా థియేటర్లలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలను ప్రదర్శింపజేయనున్నామని అన్నారు. అలాగే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినిమాలను ప్రదర్శించి.. ఉత్తమ చిత్రానికి బాలచందర్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విక్రమన్, ఆర్కే సెల్వమణి, బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి, నిర్మాత ఎస్.థాణు తదితరులు పాల్గొన్నారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.బాలచందర్...ఈ మధ్యనే చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1930 జులై 9న జన్మించిన ఆయన పూర్తి పేరు కైలాసం బాలచందర్. ‘నీర్ కుమిళి' (1965)తో దర్శకుడైన బాలచందర్ తెలుగులో ఆయన తొలి చిత్రం ‘భలే కోడలు', ‘అంతులేని కథ'తో తెలువారి మదిని దోచుకున్నారు. అలాగే బాలచందర్ తొలి తెలుగు స్టయిల్ చిత్రం ‘మరో చరిత్ర'. ప్రఖ్యాత నటులు కమల్ హాసన్, రజనీకాంత్లను తీర్చిదిద్దిన బాలచందర్ తన చిత్రాల ద్వారా ఎందరికో జీవితం ప్రసాదించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శక, నిర్మాతలు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు. ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.