Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనా ఎఫెక్ట్.. రజినీకాంత్ కూడా కమల్ హసన్ బాటలోనే..
కరోనా దెబ్బకు ప్రపంచమంతా ఒక్కసారిగా ప్రాణ భయంతో వణికిపోతోంది. కంటికి కనిపించని వైరస్ ఒక్కసారిగా మానవాళిని చిన్నా భిన్నంగా మార్చేసింది. కొన్ని దేశాల్లో మనుషులు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇండియాలో కూడా రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
ఇక కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల వరకు లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే. అయితే సినీ తారలు చాలా వరకు వారి స్థానిక ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల కమల్ హసన్ చెన్నైలోని తన ఆఫీస్ ని రోగుల కోసం వాడుకునేందుకు ఇచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ చిక్కిత్స అందించేందుకు ఉపయోగపడుతుందని ఇచ్చారు.
ఇక అదే బాటలో రజినీకాంత్ కూడా తనకున్న కళ్యాణ మండపాన్ని కూడా కొన్నిరోజుల పాటు జనాల కోసం ఉపయోగించాలని వైద్య సిబ్బందికి అందించారు. రజినీకాంత్ ఇప్పటికే తమిళ సినీ వర్కర్స్ కోసం 50లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇక ఇప్పుడు తన రాఘవేంద్ర కళ్యాణ్ మండపాన్ని కూడా కరోనా ఐసోలేషన్ వార్డుల కోసం అప్పగించినట్లు సమాచారం.