Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2.ఓ ట్రైలర్: సెల్ ఫోన్ చూడగానే మరణభయం.. విధ్వంసం ఆపడానికి రీలోడ్ అయ్యాడు చిట్టి!
Recommended Video
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 2.ఓ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటికి క్రితమే విడుదలయింది. భారీ ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్ ట్రైలర్ ని అన్ని భాషల్లో విడుదల చేశారు. రోబో చిత్రాన్ని మించేలా దాదాపు 500 కోట్ల పైగా బడ్జెట్ తో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శంకర్ చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాలు అబ్బుర పరిచే విధంగా ఉంటాయి. ఇంకా హాలీవుడ్ స్థాయిలో, ఇంత భారీ బడ్జెట్ లో రూపొందిన 2.ఓ లో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. మునుపెన్నడూ చూడని విధంగా గ్రాఫిక్స్ ఉన్నాయి.
సెల్ ఫోన్లు మాయం
ట్రైలర్ ద్వారా చిత్ర కథ కొంత తెలిసేలా శంకర్ ప్లాన్ చేశారు. ప్రజలంతా ఎవరి కార్యమ్రాలతో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ అకస్మాత్తుగా ప్రజల చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ మాయం అయిపోతుంటాయి. అంతా గందరగోళం నెలకొంటుంది. మీడియాలో బ్రేకింగ్ న్యూస్ లు దీని గురించి వస్తుంటాయి.
రాక్షస గద్ద భీభత్సం
రజనీకాంత్ ఓ కొత్త ఆడ రోబోతో కనిపిస్తారు. ఆడ రోబో మరెవరో కాదు.. అమీ జాక్సన్. ఇంతలో నగరంపై రాక్షస గద్ద దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు సూపర్ విలన్ అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. భయంకరమైన గొంతుతో మానవాళికి వార్నింగ్ ఇస్తాడు. సెల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు హంతకులే. ఇకపై సెల్ ఫోన్ చూస్తే మరణభయంతో చెల్లా చెదురు అవుతారు అంటూ వార్నింగ్ ఇస్తాడు.
రీలోడ్ అయి దూకాడు
మానవాళికి పెను ప్రమాదంగా మారిన ఈ సూపర్ విలన్ ని అంతమొందించడానికి చిట్టి రీ లోడ్ అయి రంగంలోకి దిగుతాడు. అక్షయ్ కుమార్ కు ఎదురుగా నిలబడి ' ఐ యామ్ చిట్టి రీలోడెడ్.. వర్షన్ 2.ఓ అని అంటాడు. అక్కడి నుంచి చిట్టికి,అక్షయ్ కుమార్ కు మధ్య భీకరమైన పోరు మొదలవుతుంది. ఇద్దరూ భారీ ఆకారాలతో కనిపిస్తారు.
దిమ్మతిరిగేలా గ్రాఫిక్స్
ముందుగా అనుకున్న విధంగానే ట్రైలర్ లో చూపించిన గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా రాక్షస గద్ద సృష్టించే బీభత్సం, దాని కదలికల్ని అద్భుతమైన టెక్నాలజీతో రూపొందించారు. టెక్నాలజీకి దర్శకుడు శంకర్ తన విజన్ ని జత చేశారు. నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.